మృత్యుఘోష నిలువరిద్దాం!
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది సుమారు 260 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి పెనుమూడి వారధి వరకు పలు ప్రాంతాల్లో తీరప్రాంత ప్రజలు నదిలోకి దిగుతున్నారు.
ప్రజలకు అవగాహన కలిగేలా సూచిక బోర్డులు అవశ్యం
ఇసుక తవ్వకాలపై నిరంతర నియంత్రణ తప్పనిసరి
అధికారుల సమన్వయంతోనే ప్రమాదాల కట్టడి
ఉండవల్లి వాగులో లోతైన ప్రాంతం
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది సుమారు 260 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి పెనుమూడి వారధి వరకు పలు ప్రాంతాల్లో తీరప్రాంత ప్రజలు నదిలోకి దిగుతున్నారు. స్థానికంగా నివాసముండే పెద్దలకు అవగాహన ఉండడంతో లోతు ప్రాంతాలకు వెళ్లకపోయినా విద్యార్థులు, పిల్లలు ఆటవిడుపుగా నదిలోకి వెళ్లి మృత్యువాత పడుతున్నారు. నదీతీరంలో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యటక ప్రాంతాలు ఉండటంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వేసవి సెలవులకు ఇళ్లకు వచ్చిన విద్యార్థులు సరదాగా నదీతీరానికి వెళ్లి అనుకోకుండా నీటిలో మునిగి తల్లిదండ్రులకు అంతులేని ఆవేదన మిగులుస్తున్నారు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే యంత్రాంగం నిర్మాణాత్మక చర్యలు తీసుకుని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతోంది. వరుస ఘటనలు పునరావృతం కాకుండా యంత్రాంగం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ సహకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రమాదాలు జరిగే ప్రాంతాలివే...
* మాచర్ల మండలం విజయపురిసౌత్లోని నాగార్జునసాగర్ ఎగువనే కృష్ణవేణి పుష్కరఘాట్.
* రెంటచింతల మండలం సత్రశాల.
* గురజాల మండలం దైద.
* దాచేపల్లి మండలం తంగెడ.
* అచ్చంపేట మండలం చల్లగరిగ, పులిచింతల దిగువన మాదిపాడు, చామర్రు
* బెల్లంకొండ మండలం ఎమ్మాజిగూడెం, కోళ్లూరు, బోధనం, చిట్యాల.
* అమరావతి మండలం మునుగోడు, పొందుగల, మల్లాది, దిడుగు, ముత్తాయపాలెం, ధరణికోట, అమరావతి, వైకుంఠపురం.
* తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం, రాయపూడి, తాళ్లాయపాలెం.
* తాడేపల్లి మండలం ఉండవల్లి సమీపంలో కొండవీటి ఎత్తిపోతల పథకం వద్ద, సీతానగరం ఘాట్, రైల్వేవంతెన, కనకదుర్గమ్మవారధి పిల్లర్లు.
* దుగ్గిరాల మండలం పెదకొండూరు, వీర్లపాలెం.
* కొల్లిపర మండలం మున్నంగి, కొల్లిపర, బొమ్మువానిపాలెం.
* కొల్లూరు మండలం చిలుమూరు ప్రాంతాలు ప్రమాదాలకు నిలయాలుగా ఉన్నాయి.
ఆఖరిచూపూ దక్కని దైన్యం
కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం శివారు కృష్ణానదిలో గతేడాది అక్టోబరు 2న తెనాలికి చెందిన హర్షవర్ధన్ స్నేహితులతో కలిసి సరదాగా నదిలో స్నానానికి దిగారు. నదీ ప్రవాహంలో హర్షవర్దన్ గల్లంతయ్యాడు. అప్పట్లో ఐదు రోజుల పాటు పోలీసులు గాలించినా మృతదేహం సైతం దొరకలేదు. ఒక్కగానొక్క కొడుకు హర్షవర్దన్ అల్లారుముద్దుగా పెంచుకుంటే ఆఖరిచూపు కూడా దక్కలేదని తల్లిదండ్రులు యోగేశ్వరరావు, నాగమణి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
మార్గదర్శకాల అమలు బాధ్యత ప్రభుత్వానిదే
నదిలో లోతు ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నా కొందరు యువకులు పెడచెవిన పెడుతున్నారు. ఇసుక తవ్వకాల వల్ల తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తున్నారు. వీటికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం మార్గదర్శకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉంది.
వావిలాల సుబ్బారావు, పురావస్తు పరిశోధకులు, అమరావతి
సమాచార కేంద్రంతో అప్రమత్తం చేయాలి
నది వద్ద శాశ్వత ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. దేవాలయంలో మైకు ఉన్నందున భక్తులకు నది లోతుపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయొచ్చు. స్థానికేతరులు ఎక్కువగా వస్తున్నందున ఘాట్ సమీపంలో ఒక సమాచార కేంద్రం ఏర్పాటు చేయాలి. నదిలో స్నానాలు ఎక్కడ చేయాలి, ప్రమాద ప్రాంతాలు ఎటువైపు ఉన్నాయన్న సమాచారం అందించాలి. ఇలా చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు.
పీసపాటి నాగేశ్వరశర్మ, ఆధ్యాత్మికవేత్త
ప్రమాదకర ప్రాంతాల్లో కంచెలు వేయాలి
నదీ తీరం వెంబడి ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అటువైపు వెళ్లకుండా కంచెలను ఏర్పాటు చేయాలి. దీనిని గుర్తించి రక్షణ చర్యలు ఎక్కువగా తీసుకోవాలి. అధికారుల సమన్వయలోపం కారణంగా ఎటువంటి భద్రతా చర్యలు ఘాట్ల వద్ద కనిపించడం లేదు.
కోలా వెంకటేశ్వరరావు, పర్యావరణ వేత్త, అమరావతి
భద్రతా చర్యలు చేపడతాం
నదిలో ఉన్న ప్రమాదకర గోతులతో ఎవరూ దిగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతాం. ఆలయం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి భక్తులకు కృష్ణానదిలో స్నానాలపై తగు సూచనలు చేస్తాం. ప్రమాదకర గుంతల వద్ద శాశ్వత ప్రాతిపదికన ఉండేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
ఏవీ బ్రహ్మం, సీఐ, అమరావతి
రేవుల వద్ద గస్తీ ఏర్పాటు
నదీతీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఆదేశిస్తాం. ప్రముఖ పర్యటక ప్రాంతమైన అమరావతి నదీతీరంలో ఎక్కువ మంది చనిపోతున్నందున అక్కడ ప్రత్యేకమైన రక్షణ చర్యలు తీసుకునేలా చూస్తాం. ఎస్పీతో చర్చించి రేవుల వద్ద గస్తీతోపాటు కంచె ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటాం.
శివశంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.