logo

గుంటూరు మీదుగా రైళ్లు

విజయవాడ- ఖాజీపేట మార్గంలో ఇంజినీరింగ్‌ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు.

Published : 29 Apr 2024 05:52 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: విజయవాడ- ఖాజీపేట మార్గంలో ఇంజినీరింగ్‌ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. విశాఖపట్నం ఎల్‌టీటీ- విశాఖపట్నం (18519)/(18520) రైలు ఈనెల 29 నుంచి మే 9వ తేదీ వరకు, తిరిగి మే 15 నుంచి 21వ తేదీ వరకు గుంటూరు మీదుగా నడుస్తుందని తెలిపారు. షాలిమార్‌- హైదరాబాద్‌- షాలిమార్‌ (18045)/ (18046) మే 2, 3, 8, 9, 20, 21 తేదీల్లో గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌- షాలిమర్‌(12774) మే 21న గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌ వెళ్తుంది. సికింద్రాబాద్‌- షాలిమార్‌- సికింద్రాబాద్‌ (07225)/07226) ఈనెల 29, మే 6, 20 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు మీదుగా విజయవాడ వెళ్తుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని