వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి బరితెగింపు
నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది.
పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద హల్చల్
తెదేపా నేత వాహనంపై దాడులు
వైకాపా మూకలు రెచ్చిపోవడంతో ఉద్యోగుల ఆందోళ
ఈనాడు-అమరావతి, నరసరావుపేట అర్బన్ న్యూస్టుడే : నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి తెదేపా నేతలు, వాహనాలపై దాడి చేయించడం చూసి.. ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు ఇదేం సంస్కృతి అంటూ మండిపడ్డారు. పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 9.30కు కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్యాహ్నం 12.30 వరకు అక్కడే ఉండి హల్చల్ చేశారు. తొలిరోజు ఓటింగ్ సరళి తనకు వ్యతిరేకంగా ఉందని గ్రహించిన వైకాపా ఎమ్మెల్యే వైకాపాకు చెందిన మిలటరీ సత్యనారాయణరెడ్డిని పంపి ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈక్రమంలో ఓ మహిళా ఉద్యోగిని నుంచి సత్యనారాయణరెడ్డి ఫారం లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పోలీసులు అక్కడి నుంచి సత్యనారాయణరెడ్డిని బయటికి పంపారు. అదే సమయంలో తెదేపా అభ్యర్థి అరవిందబాబు పోలింగ్ కేంద్రంలోకి పరిశీలనకు వస్తున్నారు. ఇది గమనించిన సత్యనారాయణరెడ్డి పోలింగ్ కేంద్రంలోకి ఎలా వస్తారంటూ తెదేపా అభ్యర్థిని అడ్డుకున్నారు. అరవిందబాబు వెంట ఉన్న నేతలు సత్యనారాయణరెడ్డిని కారులో ఎక్కించుకుని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. కొద్దిసేపటికే పోలీసులు అతన్ని వదిలేశారు. ఈక్రమంలో సత్యనారాయణరెడ్డి వైకాపా నేతలకు సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు అనుచరులు, కార్యకర్తలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు.
అరవిందబాబుపై కేసు పెట్టాలని గొడవ
ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తెదేపా అభ్యర్థిని కేంద్రంలోకి ఎలా అనుమతించారంటూ వాదనకు దిగి రిటర్నింగ్ అధికారిని నిలదీశారు. అరవిందబాబుపై కేసు పెట్టాలని గొడవకు దిగారు. అనంతరం బయటికి వచ్చిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అటుగా వస్తున్న కుంకులగుంటకు చెందిన తెదేపా నేత వాహనాన్ని చూసి దాన్ని ధ్వంసం చేసి కారు డ్రైవర్ను చితకబాదారు. విషయాన్ని తెలుసుకున్న తెదేపా నేతలు లాంకోటేశ్వరరావు తదితరులు మూడు వాహనాల్లో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. ఈ సమయంలో రాళ్లు, కర్రలతో మూడు వాహనాలపై వైకాపా మూకలు దాడి చేసి ధ్వంసం చేసి ఇద్దరు కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. సమాచారం తెలుసుకున్న ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అదనపు బలగాలు వచ్చి మూకలను చెదరగొట్టగా వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే కనుసన్నల్లో వాహనాల ధ్వంసం, దాడులు జరగడం గమనార్హం. ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పోస్టల్ బ్యాలెట్ రోజే పరిస్థితి ఇలాగుంటే నియోజకవర్గంలో ఎన్నికల విధులు ఎలా నిర్వర్తించాలో అని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వయంగా ఎమ్మెల్యే సమక్షంలోనే దాడులు చేస్తున్నా పోలీసులు తక్కువమంది ఉండటంతో దాడులను అడ్డుకోలేకపోయారు. పట్టణంలో సుమారు మూడుగంటల పాటు వాదనలు, దాడులు, వాహనాల విధ్వంసం జరుగుతున్నా పోలీసులు అడ్డుకోవడంలో విఫలమయ్యారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఏర్పడితే పోలింగ్ రోజు గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్షనేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసుస్టేషన్కు కిలోమీటరు దూరంలో గొడవ జరుగుతున్నా సకాలంలో పోలీసులు అడ్డుకోలేకపోవడం, పోలింగ్ ప్రశాంతంగా చూడాల్సిన పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.
‘ఈనాడు’ విలేకరి ఎక్కడున్నాడో చూడండి
వైకాపా మూకలు తెదేపా నేతల వాహనాలు, కార్యకర్తలపై తెగబడి దాడులు చేస్తున్న వైనాన్ని మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తున్నారు. దీన్ని గమనించిన వైకాపా నేతలు వీడియోలు, చిత్రాలు తీయొద్దంటూ మీడియా ప్రతినిధులను బెదిరించారు. ఈక్రమంలో ‘ఈనాడు’ విలేకరి ఎక్కడున్నారో గుర్తించి ఫొటోలు, వీడియోలు తీస్తే ఊరుకోవద్దని హెచ్చరించారు. దీంతో ‘ఈనాడు’ ప్రతినిధి అక్కడి నుంచి వెళుతుండగా ఎక్కడికి వెళుతున్నారో చూడండంటూ గట్టిగా అరిచారు. పోస్టల్ బ్యాలెట్లో వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయన్న అక్రోశంతో వైకాపా నేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఉద్యోగులకు ప్రలోభాలు ఎరవేయాలని చూసినా వారు వ్యతిరేకించడంతో దాడులకు తెగబడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. -
దేవుడి భూమి.. సమర్పయామి
[ 19-05-2024]
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. -
పల్నాడును చూసైనా.. కళ్లు తెరవలేదు..
[ 19-05-2024]
జిల్లాలో పోలింగ్కు ముందు రోజు, ఎన్నిక రోజున పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా దాడులకు తెగబడటంతో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
క్షణక్షణం ఉత్కంఠ!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
మద్యం దుకాణాలకు 144 సెక్షన్ వర్తించదా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులు, ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయిదురోజులుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూయిస్తున్నారు. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్
[ 19-05-2024]
పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేశ్ లట్కర్ నియమితులయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చెలరేగిన హింసను నియంత్రించడంలో విఫలమయ్యారన్న కారణంగా జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్పై సస్పెన్షన్ వేటు వేసింది. -
ఎట్టకేలకు కదిలిన అధికారులు
[ 19-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. -
ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై శిక్షణ
[ 19-05-2024]
సీబీఎస్ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఆంగ్లం, సైన్స్(జీవశాస్త్రం), సోషల్ ఉపాధ్యాయులు.. తాము బోధించే పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతో ఉండాలని డీఈవో పి.శైలజ తెలిపారు. -
కరిగిన ఆశలు
[ 19-05-2024]
సాధారణంగా ఉప్పు పంటలకు ఎండలు అనుకూలం. ఉప్పు పంటను ఎండా కాలం పంటగా చెప్పాలి. ఎండల తీవ్రత బాగుంటే ఉప్పు దిగుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలతో ఉప్పు రైతుకు తీరని నష్టం ఎదురైంది. -
ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
[ 19-05-2024]
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. -
మెట్ట ప్రాంతంలో తీరిన దాహం
[ 19-05-2024]
చుక్క నీటి కోసం విలవిల్లాడిన బొల్లాపల్లి మండలంలోని అయిదు గ్రామాలకు దాహం తీరింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో ఊరచెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. -
రైతులకు నికర ఆదాయమే లక్ష్యం
[ 19-05-2024]
కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా పని చేయడంతో పాటు నికర ఆదాయం సాధించేలా మార్గదర్శకం చేయాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి అటారి పదో జోన్ సంచాలకుడు డాక్టర్ షేక్ ఎన్.మీరా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు