లెక్కలో తేడా రావొద్దు
పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు 16 కేంద్రాలు ఏర్పాటు చేసింది.
ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
విధి విధానాలపై యంత్రాంగానికి శిక్షణ
పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు 16 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో 15 కేంద్రాలు మామూలు ఓట్ల లెక్కింపునకు సంబంధించినవి కాగా ఒకటి తపాలా ఓట్లకు చెందింది. ఉదయం 5 గంటల నుంచే అధికార యంత్రాంగం ఏర్పాట్లను ప్రారంభిస్తుందని, 7 గంటలకు అన్ని కేంద్రాల్లో లెక్కింపు మొదలవుతుందని బల్దియా వెల్లడించింది. గతానికి భిన్నంగా తపాలా ఓట్ల లెక్కింపును ఈసారి వేగంగా పూర్తి చేయనున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఉదయం 7 గంటలకు మొదలై, 7.30కి తపాలా ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు స్పష్టంచేశారు.
ఈనాడు, హైదరాబాద్
జూబ్లీహిల్స్లో 20 టేబుళ్లు..
జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలుండగా, వాటన్నింటికీ వేర్వేరు చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి ఆయా కేంద్రాల నుంచి సేకరించి, రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ప్రకటిస్తారు. గతంలో మాదిరి అసెంబ్లీల వారీగా 14 టేబుళ్లపై చేపడుతున్నామని, పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్నందున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం 20 టేబుళ్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద ఓ సూపర్వైజరు, ఇద్దరు సహాయకులు, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా చూసేందుకు పోటీలోని అభ్యర్థులు, వారి ఏజెంట్లకు పరిమిత సంఖ్యలో అనుమతి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాలు రికార్డు చేస్తుంటాయి. టేబుళ్ల వద్ద రౌండ్ల వారీగా వెల్లడయ్యే ఓట్ల వివరాలను ఆయా ఏజెంట్లు సైతం ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలా ధ్రువీకరించిన నివేదికను సూక్ష్మ పరిశీలకులు సంబంధిత ఏఆర్వో, ఎన్నికల పరిశీలకులకు అందజేస్తారు. అలా వచ్చిన సమాచారాన్ని ఏఆర్వోలు ఎన్నికల సంఘం సర్వర్ ద్వారా రిటర్నింగ్ అధికారికి చేర వేస్తారు. ఆయన అధికారికంగా వెల్లడిస్తారు.
పారదర్శకంగా ప్రక్రియ: రోనాల్డ్రాస్
పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, అందుకోసం అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. శనివారం బంజారాహిల్స్ ఆదివాసీ భవన్లో శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అధికారులు, సిబ్బంది ఓట్ల లెక్కింపు విధులను సమర్థంగా నిర్వర్తించాలి. అసెంబ్లీ స్థానాల వారీగా పర్యవేక్షణ ఉంటుంది. ఈవీఎంల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉండి సరి చేస్తారు. రౌండ్ల వారీ ఓట్ల వివరాలను ఆయా కేంద్రాల్లో ఉండే ఎన్నికల పరిశీలకులకు ఇవ్వాలి. లెక్కింపులో సమస్య ఎదురైతే సంబంధిత ఏఆర్వో (సహాయ రిటర్నింగ్ అధికారి)కి తెలపాలి. లెక్కింపు కేంద్రంలోకి ఫోన్లు అనుమతించం’’ అని తెలిపారు. హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ జాయింట్ సీఈవో సునందరాణి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
[ 17-06-2024]
కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
నేడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
[ 17-06-2024]
బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పాతబస్తీలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. -
మాదాపూర్లో యువకుడి అనుమానాస్పద మృతి
[ 17-06-2024]
నగరంలోని మాదాపూర్లో సాయి అనే యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. అయ్యప్ప సొసైటీలోని ఓ హోటల్ ఆరో అంతస్తు పైనుంచి పడి మరణించాడు. -
కొట్టేసి.. నల్ల కాగితాలను కరెన్సీగా మార్చేసి
[ 17-06-2024]
ఒక చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మారు. దోపిడీ చేసి డబ్బు కొట్టేశాక ఆ స్ధానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి క్షుద్రపూజలతో అసలైన కరెన్సీగా మార్చేద్దామనుకుని సిద్ధమయ్యారు. -
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
[ 17-06-2024]
రాజధానిపై అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కన్నుపడింది. ఓవైపు స్థానిక దొంగలు ఎక్కడికక్కడ ఇళ్లను గుల్ల చేస్తుంటే.. ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాతక ముఠాల కదలికలు నగరంలో అలజడి రేపుతున్నాయి. -
ఎక్కడ నడవాలో అడుగు?
[ 17-06-2024]
అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్లకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. పాదచారులకూ అదే గౌరవం ఉంటుంది. విశ్వనగరమని చెప్పుకొనే హైదరాబాద్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. కనీస మర్యాద కూడా కనిపించడం లేదు. -
పట్టుకుంటున్నా.. పట్టించుకోరు
[ 17-06-2024]
శిరస్త్రాణం ధరించరు.. రాంగ్ రూట్లో వెళ్తుంటారు.. సీసీ కెమెరాల కన్ను గప్పేందుకు నెంబరు ప్లేట్లకు మాస్క్లు.. నిబంధనలు పాటించమని పోలీసులు సదస్సులు, సమావేశాలతో అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. -
ధరణి.. ఈ సారైనా దయచూపేనా
[ 17-06-2024]
ధరణి పోర్టల్ లోపాలు సవరించేందుకు చేపట్టిన ప్రత్యేక పరిష్కార ప్రక్రియకు మోక్షం లభిస్తుందనే ఆశ రైతుల్లో మొదలయ్యింది. -
నీటి మీటర్ల మాయాజాలం
[ 17-06-2024]
మీటర్లు ఎలాగూ బయటకు కనపడవు... ఎన్ని ఉన్నాయో..లేవో ఎవరికి తెలుస్తాయి..వాటి నాణ్యత ఎవరికి తెలుస్తుంది..ఇలా ఆలోచించిన ఏజెన్సీలు నీటి మీటర్లలో చేతివాటం ప్రదర్శించాయి. -
పెరగని రుణం.. పెట్టుబడి భారం
[ 17-06-2024]
సాగు సమయంలో అన్నదాతలకు పెట్టుబడి కష్టాలు తప్పడం లేదు. పంట రుణాల ఆర్థిక కొలత (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) కూడా తక్కువగానే ఉండటంతో రైతులకు మళ్లీ భారం పడుతోంది. -
రూ కోట్లు విడుదల.. తొలగనున్న ఇక్కట్లు!
[ 17-06-2024]
కొడంగల్ నియోజకవర్గంలో విద్యా ప్రగతికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా గురుకుల భవనాల నిర్మాణాలకు రూ.73.45 కోట్లు మంజూరు చేశారు. -
అందుబాటులో ఇండోర్ స్టేడియం
[ 17-06-2024]
జిల్లాలో వ్యాపార కేంద్రమైన తాండూరులో ఔత్సాహిక క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం అందుబాట్లోకి రాబోతోంది. ఏడాది క్రితం ప్రారంభమైన పనులు తుది దశకు చేరాయి. -
అనుమతుల్లోనే లోపం పర్యవేక్షణ శూన్యం
[ 17-06-2024]
ప్రమాదకరంగా విద్యుత్తు తీగలకు అతి సమీపంగా నగరంలో పలుచోట్ల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా కడుతున్నారు. -
చర్లపల్లి రైల్వేస్టేషన్ సిద్ధం
[ 17-06-2024]
చర్లపల్లి శాటిలైట్ రైల్వే టర్మినల్ (స్టేషన్) పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులతో ఎన్ని ఇబ్బందులు ఎదురౌతున్నా అక్కడి నుంచే పూర్తిస్థాయిలో రాకపోకలు సాగుతున్నాయి. -
న్యూరో రిహబిలిటేషన్కు ఏఐ సాయం
[ 17-06-2024]
మనకు ఇప్పటికిప్పుడు ఎలాంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో రాబోయే సమస్యలేంటో, వాటిని ఎలా నివారించుకోవచ్చో ముందుగానే తెలుసుకునేందుకు కొన్ని సులభమైన పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని కిమ్స్ న్యూరో రిహబిలిటేషన్ విభాగాధిపతి డాక్టర్ అజయ్కుమార్ మిద్దె తెలిపారు. -
గోవులను రక్షించమంటే గోరక్షకులపైనే లాఠీఛార్జీ చేస్తారా...: రాజాసింగ్
[ 17-06-2024]
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందువులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలపై లాఠీ ఛార్జీ జరిపి, అరెస్టులు చేయడం ఎంత వరకు న్యాయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ ప్రశ్నించారు. -
జేఎన్టీయూలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు
[ 17-06-2024]
జేఎన్టీయూలో విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల కట్టడికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు వర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలకు సర్క్యులర్ జారీ చేశారు. -
పట్టుకోవాల్సిన వారే పట్టుబడిపోతున్నారు..!
[ 17-06-2024]
నగర సీసీఎస్లో పెచ్చుమీరిన అవినీతి ఉన్నతాధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసుకో రేటుకట్టి వసూళ్ల దందా సాగిస్తున్న సిబ్బందిని దారికి తీసుకురావటం సవాల్గా మారింది. -
నగర సీసీఎస్ ప్రక్షాళన షురూ..!
[ 17-06-2024]
నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) ప్రక్షాళన మొదలైంది. కీలకమైన విభాగంలో తాజాగా బయటపడుతున్న సిబ్బంది చేతివాటం, అక్రమార్కులతో చేతులు కలిపి సాగిస్తున్న దందాపై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. -
కారణజన్ముడు రామోజీరావు
[ 17-06-2024]
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కారణ జన్ముడని పలువురు ఈటీవీ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. -
ఆయన వ్యక్తి కాదు.. మహోన్నత శక్తి
[ 17-06-2024]
‘రామోజీ’ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆదర్శమూర్తి అని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. -
‘సింధు దర్శన్’ యాత్ర ప్రారంభం 23న
[ 17-06-2024]
దేశ ప్రజలందరినీ ఏకం చేసే లక్ష్యంతో హిమాలయ్ పరివార్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు ‘సింధు దర్శన్’ పేరిట యాత్ర నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సూర్యప్రకాష్ సింగ్ తెలిపారు. -
రాష్ట్రపతి నిలయంలో ఫాదర్స్డే వేడుకలు
[ 17-06-2024]
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఫాదర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా కుటుంబంలో తండ్రి పాత్రను, ఔన్నత్యాన్ని వివరిస్తూ వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన చేశారు. -
చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి
[ 17-06-2024]
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు ఆధ్వర్యంలో ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. -
టాక్స్ బార్ అసోసియేషన్ తెలంగాణ, ఏపీ ఉపాధ్యక్షుడిగా ఎస్బీ కాబ్రా
[ 17-06-2024]
టాక్స్ బార్ అసోసియేషన్(2024-25) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉపాధ్యక్షుడిగా మార్వాడీ శిక్షా సమితి సంయుక్త కార్యదర్శి ఎస్బీ కాబ్రా ఎన్నికయ్యారు. -
ఇద్దరి కిడ్నాప్.. రక్షించిన పోలీసులు
[ 17-06-2024]
ఆర్థిక వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాప్ గురైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు వికారాబాద్లో రక్షించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత
-
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
-
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
-
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్
-
అభిమాని సూసైడ్.. అలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదన్న సోనాలి