Cyber Crime: కేసు వాపస్ తీసుకుంటే రూ.1.50కోట్లు ఇచ్చేస్తా!
‘‘మీ కంపెనీ వ్యాలెట్ల నుంచి రూ.1.5కోట్లు కాజేసింది నేనే.. నాకు సహకరించిన ఐదుగురు నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.. మీరు కేసు వాపస్ తీసుకుంటే మీ నగదు మొత్తాన్ని ఆరునెలల్లో ఇచ్చేస్తా.. లేదంటే మీకు ఒక్కరూపాయి కూడా రాదు..’’
బాధిత కంపెనీకి సైబర్ కేటుగాడి ఆఫర్!
‘‘మీ కంపెనీ వ్యాలెట్ల నుంచి రూ.1.5కోట్లు కాజేసింది నేనే.. నాకు సహకరించిన ఐదుగురు నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.. మీరు కేసు వాపస్ తీసుకుంటే మీ నగదు మొత్తాన్ని ఆరునెలల్లో ఇచ్చేస్తా.. లేదంటే మీకు ఒక్కరూపాయి కూడా రాదు..’’
- బంజారాహిల్స్లోని ఓ కంపెనీకి సైబర్ నేరస్థుడు రెండు రోజుల కిందట పంపిన ఈ-మెయిల్ ఇది. మెయిల్ చూసి అవాక్కయిన కంపెనీ ప్రతినిధులు సైబర్క్రైం పోలీసులకు విషయాన్ని వివరించారు. మెయిల్కు స్పందించవద్దని, సైబర్ నేరస్థుడు కొల్లగొట్టిన నగదు.. బదిలీ విధానాన్ని గుర్తిస్తున్నామని త్వరలో నిందితుడిని పట్టుకుంటామని వారు చెప్పారు. భువనేశ్వర్ కేంద్రంగా ఈ భారీ మోసం జరిగింది. ఐదుగురు నిందితులను పట్టుకున్న ఇన్స్పెక్టర్ కృష్ణ బృందం సూత్రధారి కోసం గాలిస్తోంది.
కమీషన్లు ఇస్తానంటూ బ్యాంక్ ఖాతాలు.. ఈ-వ్యాలెట్లు
రాజ్ పేరుతో ఓ సైబర్ నేరస్థుడు భువనేశ్వర్లో సీఎఫ్ఎల్ విద్యుత్ బల్బులు తయారు చేసి విక్రయిస్తున్న గోబింద్ర చంద్రను మూడు నెలల కిందట ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తాను వేర్వేరు వ్యాపారాలు చేస్తుంటానని, డిజిటల్ లావాదేవీల కోసం మీ వివరాలు కావాలని, నెలకు రూ.30వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో గోబింద్ర చంద్ర వివరాలు ఇవ్వగా వాటి సాయంతో ఫోన్పే, గూగుల్పే తరహాలో ఈ-వ్యాలెట్ను తయారు చేసుకున్నాడు. లావాదేవీలు నిర్వహించేందుకు బంజారాహిల్స్లోని ఒక పేమెంట్ గేట్వే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం కటక్లోని ఇండస్ఇండ్ బ్యాంక్లో పనిచేస్తున్న దినేష్ మహంతిని పరిచయం చేసుకుని తనకు బ్యాంక్ ఖాతాలు సమకూర్చాలన్నాడు. ఇదే తరహాలో బిమల్రాయ్, బలభద్రదాస్, మనోజ్కుమార్ రౌత్లతో మాట్లాడి కమీషన్లు ఇస్తానన్నాడు. ఈనెల తొలి వారంలో పేమెంట్ గేట్వే సంస్థ నుంచి రూ.1.5కోట్ల డిజిటల్ కరెన్సీని బదిలీ చేసుకున్నాడు. దినేష్, బిమల్, దాస్, మనోజ్లు సమకూర్చిన బ్యాంక్ ఖాతాల్లోకి పంపించాడు. తర్వాత వాటిని వేగంగా వేర్వేరు ఖాతాలకు పంపించుకున్నాడు.
పాత్రధారులు దొరకడంతో..
బంజారాహిల్స్లోని బాధిత కంపెనీ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు భువనేశ్వర్కు వెళ్లి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.1.5కోట్ల నగదును కొల్లగొట్టిన రాజ్ అనే వ్యక్తిని వీరిలో ఒక్కరు కూడా చూడలేదని తెలుసుకున్నారు. తాను బెంగుళూరులో ఉంటానని గోబింద్ర చంద్రకు సైబర్ నేరస్థుడు చెప్పాడని ఫోన్ రికార్డులు చూశారు. వీరి అరెస్ట్ సమాచారం తెలుసుకున్న నిందితుడు వెంటనే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. అతడు రూ.1.5కోట్ల నగదును ఎక్కడెక్కడ విత్డ్రా చేసుకున్నాడన్న అంశంపై ఇన్స్పెక్టర్ కృష్ణ బృందం ఆధారాలు సేకరిస్తోంది. పోలీసులకు తన ఆర్థిక లావాదేవీలు తెలుస్తాయన్న భావనతో, నగదు వెనక్కి ఇస్తానంటూ సైబర్ నేరస్థుడు బాధిత కంపెనీకి మెయిల్ పంపించాడు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.