పురుగు మందు తాగి ఒకరుఆత్మహత్య
పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైందని మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా టేక్మాల్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాలు.. టేక్మాల్ గ్రామానికి చెందిన గడీల యాదయ్య (45)
టేక్మాల్, న్యూస్టుడే: పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైందని మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా టేక్మాల్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాలు.. టేక్మాల్ గ్రామానికి చెందిన గడీల యాదయ్య (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఇంటికి సమీపంలో ఉన్న ఓ వ్యక్తితో ఈనెల 16వ తేదీన అతనికి గొడవ జరిగింది. గొడవలో సదరు వ్యక్తికి గాయాలవగా ఆయన వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యాదయ్యపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జి టేక్మాల్కు వచ్చి విచారణ చేపట్టారు. విచారణ తర్వత రిమాండ్కు తరలిస్తారని మనస్తాపానికి గురయ్యాడని, దీంతో రెండు రోజులుగా యాదయ్య ఇంటి వద్దే దిగాలుగా ఉంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యాదయ్య టేక్మాల్ చిన్న చెరువు సమీపంలో పురుగు మందు తాగి అక్కడే పడిపోయాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేసి తాను పురుగు మందు తాగానని తెలపడంతో, వెంటనే అక్కడికి స్థానికులు చేరుకుని చికిత్స నిమిత్తం అతన్ని టేక్మాల్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ యాదయ్య మృతిచెందాడు. మృతుడి కుమారుడు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
మతి స్థిమితం లేక యువకుడు ఆత్మహత్య
హుస్నాబాద్ గ్రామీణం, న్యూస్టుడే: మద్యానికి బానిసై, అందుబాటులో లేని సమయంలో మతిస్థిమితం కోల్పోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ శ్రీధర్ తెలిపిన వివరాలు.. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్కు చెందిన శ్రీరాముల శ్రీనివాస్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన శ్రీరాముల వెంకటేశ్(24) గ్రామంలో క్షౌరశాల నడుపుతున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం దొరకని సమయాల్లో మతి స్థిమితం సరిగా ఉండేది కాదు. తల్లిదండ్రులు బుధవారం పనికి వెళ్లగా.. సాయంత్రం వారు ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఉరి వేసుకొని కనిపించాడు. మద్యం అలవాటుతో మతి స్థిమితం సరిగా లేక ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్