తల్లిలాంటి ఆలన.. స్వయం పాలన
రాజధానిలో కొత్తగా నిర్మించనున్న మూడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో నిమ్స్ తరహాలో స్వయం పాలిత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. మూడింటిలో రోగుల సహాయకులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా ధర్మశాలలను నిర్మించాలని మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఆస్పత్రిలో మాతా శిశు విభాగాలు ఉండనున్నాయి.
కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాతాశిశు విభాగాలు
హెలీప్యాడ్లు, నర్సింగ్ హాస్టళ్లు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
కొత్తపేటలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టనున్న ప్రదేశం
రాజధానిలో కొత్తగా నిర్మించనున్న మూడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో నిమ్స్ తరహాలో స్వయం పాలిత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. మూడింటిలో రోగుల సహాయకులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా ధర్మశాలలను నిర్మించాలని మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఆస్పత్రిలో మాతా శిశు విభాగాలు ఉండనున్నాయి. రూ.3600 కోట్ల వ్యయంతో నిర్మితమయ్యే ఈ వైద్యశాలల భవనాల నిర్మాణాలకు త్వరలోనే టెండర్లను పిల్చి పనులను అప్పగించడానికి ఆర్అండ్బీ కసరత్తు చేస్తోంది.
నగరంలో పేదలందరికీ మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్బీనగర్ సమీపంలోని కొత్తపేటలో ఒకటి, అల్వాల్ వద్ద మరొకటి, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి దగ్గర ఒకటి కలిపి మొత్తం మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఇప్పటికే సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మూడింటికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వెయ్యి పడకల చొప్పున మొత్తం 3 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి.
నూతన వైద్యశాలల్లో సౌకర్యాలివి
మాతా శిశు విభాగాలు: మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా మాతాశిశు విభాగాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యేక బ్లాక్లను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా భవన నిర్మాణల సమయంలోనే చర్యలు చేపడుతున్నారు. కనీసం వంద పడకలను అందుబాటులో ఉంచాలనుకుంటున్నారు.
ధర్శశాలలు: ప్రస్తుతం నగరంలోని ఏ ప్రభుత్వ దవాఖానాలోనూ రోగుల సహాయకులకు రాత్రుళ్లు ఉండటానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. రోడ్ల పక్కనో చెట్ల కిందో పడుకుంటున్నారు. కొత్త వైద్యశాలల్లో రోగుల సహాయకుల కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేక భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో డార్మిటరీలు, ప్రత్యేక గదులు, అత్యాధునిక క్యాంటీన్, భోజనశాల తదితర ఏర్పాట్లు ఉంటాయి. ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ భవనానికి ధర్మశాల అని పేరు పెట్టనున్నారు.
హెలీప్యాడ్లు: అత్యవసర వేళల్లో రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి రోగులను హైదరాబాద్కు ఆంబులెన్స్ల్లోనే తరలిస్తున్నారు. భవిష్యత్తులో హెలికాప్టర్లలో తరలించే పరిస్థితి వస్తే ఉపయోగపడటానికి వీలుగా మూడు కొత్త ఆస్పత్రుల్లో హెలిప్యాడ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు.
నర్సింగ్ హాస్టళ్లు: మూడు చోట్ల నర్సింగ్ హాస్టళ్లు ఏర్పాటు చేయబోతున్నారు. నర్సులకు అక్కడే ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
స్వయం ప్రతిపత్తి: మూడు నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఒక డైరెక్టర్తోపాటు కొంతమంది ఆర్ఎంవోల అధీనంలోనే పాలనంతా సాగుతుంది.
పేదలకు ఉచిత వైద్యం: నిమ్స్ తరహాలోనే కొత్త వైద్యశాలల్లో పేదలకు ఉచిత వైద్యం అందిస్తారు. అన్ని రకాల వైద్య సేవలు, అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉంటాయి.
భవనాల నిర్మాణాలకు త్వరలో టెండర్లు
గణపతిరెడ్డి, ఈఎన్సీ, ఆర్అండ్బీ
సీఎం ఆదేశాల మేరకు కొత్త ఆస్పత్రుల భవనాల నిర్మాణం కోసం టెండర్లను పిలవబోతున్నాం. కొత్తపేటలోని 22 ఎకరాల్లో 15 అంతస్తుల పైనే ఆస్పత్రి భవనం నిర్మించనున్నాం. కంటోన్మెంట్ బోర్డు ఇచ్చే అనుమతి మేరకు అల్వాల్లోని 28 ఎకరాల్లో ఎన్ని అంతస్తులు నిర్మించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రుల్లో 50 ఎకరాలు అందుబాటులో ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓ నిర్ణయానికి వస్తాం. గుత్తేదారు సంస్థకు పనులను అప్పగించిన తరువాత వేగంగా పనులను పూర్తి చేయడానికి ప్రణాళికను రూపొందించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.