Tamilisai and KCR: రాజ్భవన్కు కేసీఆర్.. గవర్నర్, సీఎంల మధ్య చిరునవ్వులు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎనిమిది నెలల తర్వాత ఇవాళ రాజ్భవన్కు వెళ్లారు. 2021 అక్టోబర్ 11న అప్పటి సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ ప్రమాణస్వీకారం కోసం ..
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎనిమిది నెలల తర్వాత ఇవాళ రాజ్భవన్కు వెళ్లారు. 2021 అక్టోబర్ 11న అప్పటి సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ ప్రమాణస్వీకారం కోసం వెళ్లిన ఆయన.. ఆ తర్వాత రాజ్భవన్ వైపు చూడలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారానికి ఇవాళ కేసీఆర్ హాజరయ్యారు. ఇటీవల రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం బాగా పెరిగిన విషయం తెలిసిందే. వివిధ అంశాల్లో రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలొచ్చాయి. తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని, కనీసం తల్లి మరణిస్తే కూడా కేసీఆర్ పలకరించలేదని గవర్నర్ తమిళిసై గతంలో వ్యాఖ్యానించారు. ఒక మహిళగానైనా తనకు గౌరవం ఇవ్వరా?అని ప్రశ్నించారు.
ఇదే సందర్భంలో గవర్నర్ వైఖరిని మంత్రులు తప్పుబట్టారు. ఈ క్రమంలో రాజ్ భవన్, ప్రభుత్వం మధ్య రాజకీయ పరమైన విమర్శలు కూడా వచ్చాయి. గవర్నర్ నివాసంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు సీఎం సహా మంత్రులు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా సీజే ప్రమాణస్వీకారం కోసం సీఎం రాజ్భవన్కు వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎం పరస్పరం పుష్పగుచ్ఛాలతో గౌరవించుకున్నారు. ఈ సమయంలో ఇరువురి మధ్య చిరునవ్వులు వెల్లివిరిశాయి. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందులోనూ సరదాగా ఉన్నారు. గవర్నర్, సీఎం మధ్య సమావేశం సాఫీగా, సహృద్భావ వాతావరణంలో జరిగిందని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్