Telangana News: భాజపాలోకి హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి?

తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు...

Published : 06 Jul 2022 02:22 IST

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం ఆమె కలిశారు. దీంతో రచనా రెడ్డి భాజపాలో చేరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతుల తరఫున హైకోర్టులో రచనా రెడ్డి కేసులు వేసి వాదించిన సంగతి తెలిసిందే. ఆమె వేసిన కేసులను అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రస్తావించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని