యెమెన్ దేశానికి వెళ్లిన వ్యక్తిపై కేసు
భారత విదేశాంగ శాఖ నిబంధనలను ఉల్లంఘించి యెమెన్ దేశానికి వెళ్లిన వ్యక్తిని గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వారు తెలిపిన కథనం ప్రకారం.. ఏపీలోని తూగో
శంషాబాద్, న్యూస్టుడే: భారత విదేశాంగ శాఖ నిబంధనలను ఉల్లంఘించి యెమెన్ దేశానికి వెళ్లిన వ్యక్తిని గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వారు తెలిపిన కథనం ప్రకారం.. ఏపీలోని తూగో జిల్లా కాకినాడకు చెందిన రాజేశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యెమెన్ దేశానికి వెళ్లి, రెండేళ్లకు పైగా ఉన్నాడు. తిరిగి దుబాయ్ మీదుగా ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీస్లో స్వదేశానికి బయల్దేరాడు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొన్న రాజేశ్ పాస్పోర్ట్, వీసా పత్రాలను పరిశీలించగా యెమెన్ దేశానికి వెళ్లినట్లు తేలింది. అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్