logo

అప్పులతో మనస్తాపం.. ఆత్మహత్య

అప్పుల బాధతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పటాన్‌చెరు ఠాణా ఏఎస్సై సురేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన సంతోష్‌కుమార్‌ (39) 3 సంవత్సరాల

Published : 12 Aug 2022 03:56 IST

పటాన్‌చెరు అర్బన్‌: అప్పుల బాధతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పటాన్‌చెరు ఠాణా ఏఎస్సై సురేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన సంతోష్‌కుమార్‌ (39) 3 సంవత్సరాల క్రితం 3ఏళ్ల క్రితం తెల్లాపూర్‌నకు వచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించేవాడు. తెలిసినవారి వద్ద నుంచి రూ.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న నగదు చెల్లించాలని సంతోష్‌కుమార్‌పై ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేశాడు. బుధవారం రాత్రి పటాన్‌చెరు మండలం ముత్తంగి సర్వీస్‌ రహదారి పక్కన ఉరివేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు ముందు భార్య శిరీషకు ఫోన్‌చేసి తాను బలవన్మరణానికి పాల్పడుతున్నానని చెప్పి లోకేషన్‌ షేర్‌ చేశాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి సంతోష్‌ కుమార్‌ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని