దైవదర్శనానికి వెళ్తూ.. మృత్యుఒడికి
దైవదర్శనం కోసం కారులో బయల్దేరిన ఓ కుటుంబాన్ని విధి వెంటాడింది. రెయిలింగ్ రూపంలో మృత్యువు తల్లీకుమార్తెను బలిగొంది. తండ్రి, కుమారుడు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో ఆదివారం
కారులోకి రెయిలింగ్ దూసుకెళ్లి తల్లీకుమార్తె దుర్మరణం
గార్లదిన్నె, న్యూస్టుడే: దైవదర్శనం కోసం కారులో బయల్దేరిన ఓ కుటుంబాన్ని విధి వెంటాడింది. రెయిలింగ్ రూపంలో మృత్యువు తల్లీకుమార్తెను బలిగొంది. తండ్రి, కుమారుడు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. నగరంలోని రామకోటి కాలనీకి చెందిన రఘువరరాజా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయాన్ని దర్శించుకోవడానికి తెల్లవారుజామున సొంత కారులో బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గార్లదిన్నె సమీపానికి రాగానే కారు అదుపు తప్పింది. దీంతో జాతీయ రహదారి పక్కన డివైడర్లకు అమర్చిన రెయిలింగ్ కారులోకి చొచ్చుకెళ్లింది. ప్రమాదంలో ఆయన భార్య జయంతి(42), కుమార్తె కీర్తన (10) అక్కడికక్కడే మృతిచెందారు. రఘువరరాజా, కుమారుడు సంకల్ప ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్