logo

తీగల వంతెన పైనుంచి దూకిన మహిళ గల్లంతు

మాదాపూర్‌ దుర్గం చెరువు తీగల వంతెన పైనుంచి నీటిలోకి దూకి ఓ మహిళ గల్లతైంది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. మాదాపూర్‌ సీఐ పి.రవీంద్ర ప్రసాద్‌ వివరాల ప్రకారం..

Published : 29 Sep 2022 03:38 IST

దుర్గం చెరువులో గాలిస్తున్న పోలీసులు


చెరువు వద్ద పోలీసులు, సహాయక సిబ్బంది

రాయదుర్గం, న్యూస్‌టుడే: మాదాపూర్‌ దుర్గం చెరువు తీగల వంతెన పైనుంచి నీటిలోకి దూకి ఓ మహిళ గల్లతైంది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. మాదాపూర్‌ సీఐ పి.రవీంద్ర ప్రసాద్‌ వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్వప్న(23) 8 నెలలుగా కుంగుబాటు సమస్యతో సతమతమవుతోంది. కొంత కాలం క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటూ, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు దుర్గం చెరువు వద్దకు వచ్చిన స్వప్న.. తీగల వంతెన పైనుంచి నీటిలో దూకింది. సందర్శకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వంతెన చెంత పడి ఉన్న బ్యాగులో పరిశీలించగా అందులో ప్రైవేటు ఆసుప్రత్రిలో చికిత్స పొందుతున్న ప్రిస్క్రిప్షన్‌ లభించింది. దాని ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమె సోదరి ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని