Hyderabad: ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వచ్చి వాహనంతో డ్రైవర్ పరారు
ఏటీఎంలో నగదు పెట్టడానికి వచ్చిన వాహనంతో డ్రైవర్ పరారైన ఘటన ఇది. రాజేంద్రనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పవన్ తెలిపిన వివరాల మేరకు
కిస్మత్పూర్ బ్రిడ్జిపై డ్రైవర్ ఫారూఖ్ వదిలివెళ్లిన వాహనం
రాజేంద్రనగర్, న్యూస్టుడే: ఏటీఎంలో నగదు పెట్టడానికి వచ్చిన వాహనంతో డ్రైవర్ పరారైన ఘటన ఇది. రాజేంద్రనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పవన్ తెలిపిన వివరాల మేరకు.. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్ కెనరా బ్యాంక్ ఎటీఎంకు ఉద్యోగులు అశోక్, భాస్కర్, కేవీ రమణ, చంద్రయ్యతో పాటు వాహన డ్రైవర్ బోరబండకు చెందిన ఫారూఖ్(25) రూ.31లక్షల నగదు తీసుకొచ్చారు.
ఉద్యోగులు ఏటీఎంలోకి వెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కడే ఉన్న డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. కొద్దిసేపటికి కేంద్రం నుంచి బయటకు వచ్చిన గన్మెన్ చంద్రయ్య వాహనం కనిపించకపోవడంతో లోపలఉన్నవారికి సమాచారం ఇచ్చాడు. చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారైన ఫారుఖ్ వాహనాన్ని కిస్మత్పూర్ బ్రిడ్జి వద్ద నిలిపేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి తనిఖీచేసి రూ.3లక్షలతో డ్రైవర్ పరారైనట్లు గుర్తించారు. మిగిలిన రూ.28లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్