బరితెగించిన దోపిడీ దొంగలు
రాజధానిలో దోపిడీ దొంగలు బరి తెగించారు. నాగోల్ పరిధిలోని ఆభరణాల దుకాణంలో బంగారం దోపిడీ చేయడంతో పాటు అడ్డుకొనేందుకు యత్నించిన ఇద్దరిపై కాల్పులు జరిపి పరారయ్యారు.
నాగోలులో కాల్పులు.. బంగారం అపహరణ
గాయపడిన యజమాని కళ్యాణ్, వ్యాపారి సుఖ్దేవ్
ఈనాడు- హైదరాబాద్, కొత్తపేట, నాగోల్, న్యూస్టుడే: రాజధానిలో దోపిడీ దొంగలు బరి తెగించారు. నాగోల్ పరిధిలోని ఆభరణాల దుకాణంలో బంగారం దోపిడీ చేయడంతో పాటు అడ్డుకొనేందుకు యత్నించిన ఇద్దరిపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఘటనలో బంగారం వ్యాపారి తీవ్రంగా గాయపడ్డారు. దుకాణం యజమాని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గురువారం పొద్దుపోయాక జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.
రెండు రౌండ్ల కాల్పులు
రాజస్థాన్లోని పాలీ జిల్లా జైతరణ్ తహసీల్కు చెందిన కల్యాణ్ చౌదరి వనస్థలిపురంలో ఉంటూ చైతన్యపురి ఠాణా పరిధిలోని స్నేహపురి కాలనీలో మహదేవ్ జ్యుయెలర్స్ పేరిట ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో దుకాణం మూసేయడానికి సిద్ధమవుతుండగా.. ఆభరణాల వ్యాపారి రాజ్కుమార్ సురానా సుఖ్దేవ్ సికింద్రాబాద్ నుంచి బంగారం తీసుకొచ్చాడు. అప్పటికే ఆభరణాలు కొనేందుకు వచ్చిన ముగ్గురు వినియోగదారులు కల్యాణ్ చౌదరితో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలు దుకాణానికి కొద్ది దూరంలో నిలిపారు. అందులో ఇద్దరు నడుచుకుంటూ వచ్చి అకస్మాత్తుగా దుకాణంలోకి ప్రవేశించారు. ఒకరు హెల్మెట్, మరొకరు మాస్క్ ధరించి ఉన్నారు. అందులో ఒకరు దేశవాళీ తుపాకీతో బెదిరిస్తూ దుకాణంలో ఉన్న ముగ్గురు వినియోగదారుల్ని బయటకు నెట్టేసి షట్టర్ మూసేశారు. వ్యాపారి సుఖ్దేవ్ తీసుకొచ్చిన బంగారం, దుకాణంలోకి కొన్ని ఆభరణాలను ఇవ్వాలంటూ బెదిరించారు. నలుగురి మధ్య పెనుగులాట జరిగింది. లాభం లేక రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. సుఖ్దేవ్కు చెవి, భుజం దగ్గర రెండు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. కల్యాణ్కు ముక్కు దగ్గర బుల్లెట్ గాయాలయ్యాయి.
బంగారంతో పరార్..
దుండగులు లోపలికి వెళ్లాక ఒక్కసారిగా తుపాకీ శబ్దం రావడంతో బయట నిలబడ్డ ముగ్గురు కస్టమర్లు షెట్టర్ తెరిచారు. ఇద్దరు దుండగులు బంగారం సంచి, దుకాణంలో నగదు లాక్కుని మిగతా ఇద్దరు వ్యక్తులతో కలిసి ద్విచక్రవాహనాలపై వెళ్లిపోయారు. అంతా రెండు నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. స్థానికులు తేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. వెంబడించినా ప్రయత్నం లేకపోయింది. బంగారం ఎంత దోపిడీ చేశారనేది తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారు.
గురువారం తెస్తున్నారని..
వ్యాపారి సుఖ్దేవ్ ప్రతి గురువారం కల్యాణ్ దుకాణానికి వచ్చి బంగారం ఇస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిందితులు సుఖ్దేవ్ను అనుసరించి దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించారు. అధికారులతో 15 బృందాలు ఏర్పాటు చేశారు. రాచకొండ అదనపు కమిషనర్ సుధీర్బాబు, డీసీపీ సన్ప్రీత్సింగ్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పారిపోతున్న దుండగులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.