ఒక రోజు ఆగితే.. వారంపాటు ప్రభావం!
గ్రేటర్ వ్యాప్తంగా తరచూ ఆర్టీఏ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. రోజంతా సేవలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. సెంట్రల్ సర్వర్లు మొరాయించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. శాశ్వత పరిష్కారం వైపు ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు.
తరచూ మొరాయిస్తున్న సర్వర్లు
గ్రేటర్ ఆర్టీఏ సేవల్లో తీవ్ర ఇబ్బందులు
గ్రేటర్ వ్యాప్తంగా తరచూ ఆర్టీఏ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. రోజంతా సేవలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. సెంట్రల్ సర్వర్లు మొరాయించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. శాశ్వత పరిష్కారం వైపు ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. తెలంగాణలో సగానికిపైగా ఆర్టీఏ కార్యకలాపాలు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి పరిధిలోని ఖైరతాబాద్, మెహిదీపట్నం, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, కొండాపూర్, ఉప్పల్, మలక్పేట్, సికింద్రాబాద్, బండ్లగూడ కార్యాలయాల్లో ఈ-సేవలు అందిస్తున్నారు. దాదాపు 80 లక్షల వాహనాలుండగా నిత్యం 2500 వరకు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఎల్ఎల్ఆర్ లైసెన్సుల నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ వరకు దాదాపు 56 రకాల సేవలు ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం ఉంది. ఆయా కార్యాలయాల పరిధిలో నిత్యం 6-7 వేల రకాల కార్యకలాపాలు జరుగుతుంటాయి. సర్వర్ల డౌన్తో ఎప్పటికప్పుడు ఈ-సేవలు నిలిచిపోవడం వల్ల ఆ ప్రభావం వారంరోజులపాటు ఉంటోందని సిబ్బంది వాపోతున్నారు. ఒక రోజు నిలిచిపోవడం వల్ల ఆ స్లాట్లన్నీ రెండోరోజు లేదంటే తర్వాత రోజు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఆ రోజు వచ్చిన కొత్త స్లాట్లు కేటాయింపు తక్కువ చేయడం ద్వారా కనీసం వారం రోజులపాటు ఆయా కార్యాలయాల వద్ద రద్దీ ఏర్పడుతోంది. చాలామంది కార్యాలయాలకు సెలవు పెట్టి, పనులు వాయిదా వేసుకొని వస్తుంటారు. తీరా కార్యాలయాలకు చేరుకున్న తర్వాత సర్వర్ పనిచేస్తుందో లేదో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
కారణం అదేనా...?
రవాణాశాఖ మూడంచెల సేవలకు ప్రత్యేకంగా సర్వర్లు నిర్వహిస్తోంది. అయితే ఈ-సేవ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్(టీఎస్టీఎస్) ఐటీ సేవలను అందిస్తోంది. స్లాట్ బుకింగ్ ఇతర వివరాలను ఆర్టీఏ ఈ-సేవ సర్వస్ నుంచి సమాచారం పొందుతోంది. అయితే టీఎస్టీఎస్ సర్వర్లో సాంకేతిక లోపాలు కారణంగా ఆ ప్రభావం ఈ-సేవ సేవలపై పడుతోంది. తద్వారా ఆర్టీఏ సేవలకు కూడా ఆటంకం వాటిల్లుతోంది. దీంతో చాలామందికి స్లాట్లు బుక్ కావడం లేదు. ఆన్లైన్లో చెల్లించే రుసుములు కూడా ఫెయిల్ అవుతున్నాయి. కొన్నిసార్లు ఒక్కో సేవ కోసం రెండు, మూడు రోజులపాటు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని చెబుతున్నారు. ప్రతి కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఈ సేవలు అందిస్తున్నారు. ఈ తరుణంలో ఈసేవా కేంద్రాలకు సంబంధించి సర్వర్లలో లోపాలను సరిదిద్దాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. సాధారణ రోజుల్లో గంటలో అయ్యే పనికోసం ప్రస్తుతం నాలుగైదు గంటలుపాటు నిరీక్షణ తప్పదు. కొందరైతే నిరీక్షించలేక తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ ఇబ్బందులు పడలేక బుక్చేసిన స్లాట్లను విడిచి పెట్టి మళ్లీ కొన్ని రోజుల తర్వాత వస్తున్నారు. ఒకవేళ సాంకేతిక సమస్యలు కారణంగా సేవల్లో జాప్యం జరిగితే స్లాట్లను తర్వాత రోజుల లేదంటే మరో రోజుకు పొడిగిస్తామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. వాహనదారులు స్లాట్లు వదులుకొని నష్టపోవద్దని సూచిస్తున్నారు. మరోవైపు సర్వర్లు పనిచేయక పోవడంతో ఇదే అదనుగా దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.