పండు కొనలేం.. కూర వండలేం
ఎడతెరిపిలేకుండా వర్షాలు.. వరదలతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ పంటలు ప్రారంభ దశలో కురిసిన భారీ వర్షాలు ఇటు కూరగాయల పంటను, పండ్ల తోటలను దెబ్బతీశాయి.
వర్షాలు.. వరదలతో దెబ్బతిన్న పంటలు
ఈనాడు, హైదరాబాద్: ఎడతెరిపిలేకుండా వర్షాలు.. వరదలతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ పంటలు ప్రారంభ దశలో కురిసిన భారీ వర్షాలు ఇటు కూరగాయల పంటను, పండ్ల తోటలను దెబ్బతీశాయి. ఉత్తర భారతం.. దక్షిణ భారతం అనే తేడా లేకుండా వరదలు ముంచెత్తడంతో పంటలు కొట్టుకుపోయాయి. ఉత్తరాదిన ఆపిల్ పంటలు దెబ్బతినడంతో నగరానికి వచ్చే పండ్లు భారీగా తగ్గిపోయాయి. దాదాపు 50 శాతం పంట వర్షాలపాలైనట్లు లెక్కలు చెబుతున్నాయి. కిలో ఆపిల్ రూ. 250కి పైగా మార్కెట్లో ధర పలుకుతుంది. ఇదే బాటలో దానిమ్మ ధరలు ఉన్నాయి. వందకు నాలుగు నుంచి 5 వరకూ వచ్చే దానిమ్మలు ఇప్పుడు రూ.250 పెడితే కాని నాలుగు రావడంలేదు. అన్ని పండ్లు అందుబాటు ధరల్లోకి రావాలంటే మరో 15 రోజులు సమయం పడుతుందని బాటసింగారం హోల్సేల్ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి సీహెచ్. నరసింహారెడ్డి చెప్పారు.
మరో 20 రోజుల వరకూ.. వర్షాలు కురవకముందే కొండెక్కిన కూరగాయల ధరలు.. ఇప్పుడు వరదలతో బెంబేలెత్తిస్తున్నాయి. కిలో టమాట రూ. 100కి తగ్గడంలేదు. వాస్తవానికి వారం పది రోజుల్లో రూ. 50 నుంచి రూ. 60కి అందుబాటులోకి వస్తాయని అందరూ భావించారు. ఇప్పుడు వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో మరో 20 రోజుల వరకూ ఇలాగే ధరలుంటాయని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. వికారాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల నుంచి టమాటా పంట అందుబాటులోకి వస్తుందనుకుంటే.. వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. శ్రావణమాసం ప్రారంభమయ్యే నాటికి కాస్త ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నా.. అప్పుడు వినియోగం ఎక్కువగా ఉంటుందని దీంతో ధరలు స్థిరంగా ఉంటాయని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్లం, వెల్లుల్లి కిలో రూ. 250కి తగ్గడంలేదు. రైతుబజారులో మాత్రం రూ. 200 చొప్పున దొరుకుతోంది.
ఖరీఫ్తోనే ధరలు తగ్గుదల..
నగరానికి రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, యాదాద్రి, వికారాబాద్ ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తాయి. ఖరీఫ్ కాలం మరో నెలరోజుల్లో పూర్తిస్థాయిలో ప్రారంభమవుతున్న వేళ.. భారీగా వర్షాలు పడడంతో మొక్క దశలోనే పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. స్థానిక పంటలు అందుబాటులోకి వస్తేనే కూరగాయల ధరలు తగ్గుతాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి మిగతారాష్ట్రాల్లో కూడా ఉంది. ప్రస్తుతం 80 శాతం కూరగాయలు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న తరుణంలో రవాణా ఖర్చులు భారీగా ఉండడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానిమ్మ ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి వస్తుందని.. ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్ నుంచి రావడంతో వాటి ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
[ 17-05-2024]
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా