logo

బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ

బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 28 Mar 2024 07:55 IST

సంజీవ రెడ్డినగర్‌, న్యూస్‌టుడే: బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కుంట నాగరాజు, ఛైర్మన్‌ కొత్తపల్లి సాయిబాబాగౌడ్‌ ఆమెకు స్వాగతం పలికారు. అద్దాల మండపాన్ని నీతా అంబానీ దర్శించుకున్నారు. సుమారు 15 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఐపీఎల్‌ సందర్భంగా నగరంలో ముంబాయి ఇండియన్‌ క్రికెట్‌ జట్టు ఎప్పుడు ఆడినా ఆ టీం యజమానిగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని