ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది.
నగరంలో భారాస నేతలకు కాంగ్రెస్ గాలం
హస్తం గూటికి చేరనున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
మరికొంత మంది శాసనసభ్యులతో చర్చలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరగా.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఇదే దారిలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరడానికి సిద్ధంకాగా.. కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకించడంతో తాత్కాలికంగా ప్రక్రియ ఆగిందని చెబుతున్నారు. కొంతమంది సీనియర్ నేతలు కూడా మూడు రంగుల జెండా మెడలో వేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో భారాసను ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు వెళ్లిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చిత్రంలో టీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ, మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి.
కొందరిపై విముఖత.. మరికొందరికి భరోసా
ఇద్దరు మాజీ మంత్రులు కాంగ్రెస్లోకి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారని తెలిసింది. ఇందులో ఒకరి విషయంలో చేర్చుకోవడానికి అగ్రనేతలు సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్రెడ్డి భారాసను వీడుతున్నారని రెండు నెలల కిందట పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీన్ని మల్లారెడ్డి ఖండించినా.. కాంగ్రెస్ అగ్రనేతలు అంగీకరిస్తే కొద్ది నెలలు తరువాత ఈ చేరికలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ఈ ఇద్దరే కాకుండా మరో నలుగురు కూడా సిద్ధమైనట్లు సమాచారం. వీరంతా ఎన్నికల ముందు చేరతారా.. తరువాత వెళ్తారా అన్నది వారం రోజుల్లో తేలుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఒకవేళ ఓడిపోతే మంత్రివర్గంలో చోటిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఇతర ఎమ్మెల్యేలకు సైతం అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారని తెలుస్తోంది. భారాసలోని కీలక నేతలను గుర్తించి మాట్లాడబోతున్నామని కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు.
వారికి అధికారం.. వీరికి అవసరం
సాధారణంగా ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలకే అధికారం చెలాయించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండిపోతే ఎవరూ పట్టించుకోరని, అధికారులపై సైతం పెత్తనానికి వీలుండదు. మహానగరం పరిధిలో మొన్నటి ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సీనియర్లే. ఒక్కొక్కరు రెండుసార్లు నుంచి ఆరేడుసార్లు గెలిచిన వారే. గత భారాస ప్రభుత్వంలో వీరంతా పూర్తి అధికారాన్ని చెలాయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గులాబీ ఎమ్మెల్యేలే ఎక్కువ స్థానాల్లో గెలిచినా.. ఆ పార్టీ ప్రతిపక్షంగా మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు వారిని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఇలా నాలుగున్నరేళ్లు డమ్మీలుగా మిగిలిపోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. కాంగ్రెస్ చేరుతున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ నాలుగుసార్లు గెలిచారు. ఆయన కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్లో చేరుతానని చెప్పడానికి ప్రకాష్గౌడ్ సీఎంను కలిశారని తెలిసిన వెంటనే స్థానిక, జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం ఫోన్ చేయడం ప్రారంభించారని ఆయన వర్గీయులు తెలిపారు. అధికారుల నుంచి ఇలాంటి స్పందనే కావాలన్న ఉద్దేశంతో మిగిలిన వారు సైతం పార్టీ మారాలని భావిస్తున్నారు.
కార్పొరేటర్లతో చర్చలు..
బల్దియాలో భారాసకు బలం ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీని దెబ్బతీయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డితోపాటు పది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో ఆరేడుగురితో చర్చలు జరిపినట్లు తెలిసింది. భారాసలో జనంతో సంబంధాలున్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులను చేర్చుకోవడం ద్వారా గ్రేటర్లో బలోపేతం కావాలని.. రాజధాని పరిధిలో కనీసం మూడుస్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు
[ 02-05-2024]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘జనసేన’ పార్టీ గుర్తు ‘గాజుగ్లాసు’ను హైదరాబాద్లోని మూడు లోక్సభ నియోజకవర్గాల్లో చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు కేటాయించారు. -
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
[ 02-05-2024]
నాంపల్లికి చెందిన కిర్పాన్ కౌర్ ఖనూజా అబిడ్స్ స్లేట్ ది స్కూల్లో పదో తరగతి చదువుతోంది. మార్చి ఒకటిన ప్రీ ఫైనల్ పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై తల్లి అస్మిత్కౌర్ కలిసి ఇంటికెళ్తుండగా.. ఓ యువకుడు అడ్డొచ్చాడు. అదుపుతప్పి తల్లీకూతురు కిందపడ్డారు. -
హస్తం చెంతకా.. కమలం గూటికా?
[ 02-05-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో భాజపా, కాంగ్రెస్లు గులాబీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి పోటీపడుతున్నాయి. -
వారి ఓటును వారికి వేసుకోలేరు
[ 02-05-2024]
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంటుంది. ఇది చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఎవరూ నిలబడటం లేదు. -
కొత్త ఓటరు కార్డులు లేనట్టేనా ?
[ 02-05-2024]
కొత్త ఓటర్లకు ఈసారి గుర్తింపు కార్డులు లేనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్కు మిగిలింది పది రోజులే. అయినా ఎన్నికల సంఘం ఇంకా ముద్రణ ప్రారంభించలేదనే విమర్శలొస్తున్నాయి. -
రూ.2.95 కోట్ల నగదు స్వాధీనం
[ 02-05-2024]
సరైన పత్రాల్లేకుండా బ్యాంకులకు తరలిస్తున్న రూ.1.06 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. -
అక్కడ.. పోలింగ్ సిబ్బంది అందరూ మహిళలే
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు నగరవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం మహిళా సిబ్బందిని నియమించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. -
ఐదొందలిస్తే అదనపు సేవ
[ 02-05-2024]
వైద్యులు ధ్రువీకరించినా.. రూ.500 ఇస్తేనే మీకు పిల్లలు పుట్టినట్టు ధ్రువీకరణ ఇస్తామంటూ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. కొన్ని మీసేవ కేంద్రాలు, కొందరు జీహెచ్ఎంసీ అధికారులు జనన, మరణ ధ్రువపత్రాల జారీని అవినీతిమయం చేశారు. -
ఓటరు చీటీలు మేమే ఇస్తాం
[ 02-05-2024]
నగరంలో ఓటరు చీటీల పంపిణీ గందరగోళంగా మారింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి వాటిని పంపిణీ చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ కొన్ని నియోజకవర్గాల్లో నేతల చేతుల్లోకి వెళ్లింది. -
ప్రచారానికి రండి.. సదుపాయాలు దండి
[ 02-05-2024]
అయ్యా! పనివాళ్లు దొరకడంలేదు. నలుగురిని పిలుస్తుంటే ఒక్కరే వస్తున్నారు. అందరూ ప్రచారానికి వెళ్లిపోతున్నారు. యజమాని..: కూలీ కంటే డబ్బులు ఎక్కువ వస్తాయా..? -
మేయర్ ఇంట్లో చొరబడిన అగంతకుడు
[ 02-05-2024]
మేయర్ ఇంట్లోకి అగంతకుడు చొరబడ్డాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం..ఎన్బీటీనగర్లోని మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ అగంతకుడు వచ్చి నేరుగా ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లాడు. -
చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స
[ 02-05-2024]
చిన్నారుల్లో అరుదుగా వచ్చే కాలేయ క్యాన్సర్కు చికిత్స చేసి అరుదైన ఘనత సాధించారు నిమ్స్ వైద్యులు. ఆస్పత్రి డైరెక్టర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ సర్జన్ నగరి బీరప్ప చికిత్స చేశారు. -
అమ్మాయిలా నటిస్తూ.. నగ్నచిత్రాలు పంపుతూ..
[ 02-05-2024]
బెట్టింగ్కు అలవాటుపడ్డ కుర్రాడు.. నేరస్థుడి అవతారమెత్తాడు. డేటింగ్ యాప్లో అమ్మాయిలా నటించి మోసగిస్తున్న అతడ్ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
బోను వద్దకు వెళ్లి మేకను వదిలేసిన చిరుత
[ 02-05-2024]
విమానాశ్రయం రన్వే మైదానంలోకి నాలుగు రోజుల క్రితం చొరబడిన చిరుత మంగళవారం రాత్రి 10.57 గంటలకు ఓ బోను వద్దకు వచ్చింది. అందులో ఉన్న మేక జోలికి మాత్రం వెళ్లలేదు. -
ఓటర్లను మభ్యపెట్టడానికే భాజపాపై దుష్ప్రచారం
[ 02-05-2024]
ఆరు గ్యారంటీ పథకాల అమల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ మండిపడ్డారు. -
ఠాణాకు చేరిన మైనర్ల ప్రేమ
[ 02-05-2024]
ఆ బాలికకు పదిహేనేళ్లు నిండలేదు. అబ్బాయికీ 18 లోపే. వీరి మధ్య చిగురించిన ప్రేమ గర్భం వరకు వెళ్లడంతో పెద్దలకు తెలిస్తే తిడతారని ఆ బాలుడు బాలికకు గర్భవిచ్ఛిత్తి మాత్రలు వేయించాడని తెలిసింది. -
సీఎంపై ఓయూ పీఎస్లో ఫిర్యాదు
[ 02-05-2024]
ఓయూ సెలవుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ భాష సంస్కారవంతమైంది
[ 02-05-2024]
తెలంగాణ భాష ఎంత గొప్పదో పోతన, పాల్కుర్కి, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి, కాళోజీలలో ప్రతిఫలిస్తుందని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అన్నారు -
నిమ్స్ కార్మికులకు అండగా ఉంటా
[ 02-05-2024]
నిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే కార్మికులకు అండగా ఉంటానని ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఆస్పత్రిలో నిర్వహించిన కార్మిక దినోత్సవంలో పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ డేగ కళ్లు
[ 02-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటోంది. -
సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
[ 02-05-2024]
పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో పలువురు భారాస నాయకులు, కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్లో చేరారు. -
కోడ్ ముగిశాక హామీలన్నీ అమలు
[ 02-05-2024]
ఆరు గ్యారంటీల్లో అయిదింటిని అమలు చేశామని, మిగిలిన వాటినీ ఎన్నికల కోడ్ ముగిశాక తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు