logo

పేద విద్యార్థులకు సహకారం ప్రశంసనీయం

చారిత్రక నేపథ్యం కలిగిన రాజ్‌బహదూర్‌ వెంకట్రామ్‌రెడ్డి వసతి గృహ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి అన్నారు.

Published : 03 May 2024 03:36 IST

దాతలు మంజిత్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలను సత్కరించిన డాక్టర్‌ చిన్నారెడ్డి, జితేందర్‌రెడ్డి

అబిడ్స్‌: చారిత్రక నేపథ్యం కలిగిన రాజ్‌బహదూర్‌ వెంకట్రామ్‌రెడ్డి వసతి గృహ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి అన్నారు. గురువారం అబిడ్స్‌లోని వసతి గృహ వార్షికోత్సవంలో దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. విద్యార్థుల కోసం టేబుల్‌ టెన్నిస్‌ టేబుళ్లను ఇచ్చిన దాతలు ఎల్‌.మంజిత్‌రెడ్డి, పి.లక్ష్మారెడ్డిలనుసన్మానించారు. వసతిగృహం అధ్యక్షుడు రంగారెడ్డి, ఉపాధ్యక్షురాలు సుకన్యారెడ్డి, కార్యదర్శి మోహన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి వాసుదేవరెడ్డి, కోశాధికారి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని