స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
హైదరాబాద్: ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. నిర్మాణ రంగంలో హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నగరంలోని హైటెక్స్లో గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షోను మరో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి శ్రీధర్బాబు ప్రారంభించారు.
‘‘40 శాతం విద్యుత్ను నిర్మాణ రంగం వినియోగిస్తోంది. కర్బన ఉద్గారాలు సైతం వెలువడుతున్నాయి. హరిత భవనాల గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలి. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీటి నిర్మాణం ప్రారంభమైంది. ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రంలోని అప్పటి మన్మోహన్సింగ్ సర్కారు కఠిన చట్టాలను తీసుకొచ్చింది. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆకస్మిక తనిఖీలు చేశాను. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
మా ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఐటీ రంగంలో రూ.వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగాలతో పాటు పరోక్షంగా ఎన్నో అవకాశాలు లభిస్తాయి. సులభతర వాణిజ్య విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెట్టుబడిదారులు, నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది’’ అని శ్రీధర్బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
తెదేపా (TDP) రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది. -
పవన్కు పంచాయతీరాజ్... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే!
Andhra Pradesh Cabinet Portfolios: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. -
తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సాయాన్ని సీఎం చంద్రబాబు పెంచారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. -
వయనాడ్ను వదులుకోనున్న రాహుల్.. ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ..?
Priyanka Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గెలిచిన వయనాడ్ స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. -
జూనియర్లకు మంత్రి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం: అయ్యన్నపాత్రుడు
‘జూనియర్లకూ మంత్రులుగా పనిచేసే అవకాశం ఇవ్వాలి. వారికి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం. సీనియర్లుగా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం’ అని నర్సీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. -
దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వైకాపా తీరు: ఎమ్మెల్యే రఘురామ
‘దొంగే.. దొంగా దొంగా అన్నట్లు ఉంది వైకాపా నేతల తీరు. ఎవరూ ఎవరినీ ఏమీ అనకముందే వారిని కొట్టారంటూ దిల్లీలో విజయసాయిరెడ్డి పెడబొబ్బలు పెడుతున్నారు. -
చంద్రబాబు దార్శనికత రాష్ట్రానికి అవసరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సామాజికవేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో పోస్టు చేశారు. -
హింసాత్మక ఘటనలకు వైకాపా వాళ్లే బాధ్యులు
పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య సహా అనేక మంది తెదేపా కార్యకర్తల్ని కిరాతకంగా చంపడం దారుణం కాదా? అని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ప్రజాపాలన మొదలు.. సీఎంగా చంద్రబాబు రాకతో మంచిరోజులు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ వచ్చిందని తెదేపా సీనియర్ నేతలు వర్ల రామయ్య, టీడీ జనార్దన్ తెలిపారు. -
పింఛన్ల పెంపు గొప్ప విషయం: రామకృష్ణ
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
మెగా డీఎస్సీపై తొలి సంతకం హర్షణీయం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేయడాన్ని హర్షిస్తూ తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్లు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. -
ఎన్నికల ఫలితాలపై భాజపా సమీక్ష
వచ్చే నెల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని భాజపా రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆ పార్టీ పోటీ చేసిన శాసనసభ, లోక్సభ స్థానాల వారీగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సమీక్షలు జరిగాయి. -
విజయసాయి విచారణ ఎదుర్కోవాల్సిందే: బుద్దా వెంకన్న
ఉత్తరాంధ్రను దోచుకున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెదేపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బుద్దా వెంకన్న హెచ్చరించారు. -
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టి కృషి
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టిగా కృషి చేద్దామని జనసేన నాయకులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏపీ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కోరారు. -
మహారాష్ట్రపై పట్టుకు గట్టి ప్రయత్నం
మహారాష్ట్రపై పూర్తి పట్టు సాధించేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ గురువారం తెలిపారు. -
మాది చేతల ప్రభుత్వమని నిరూపించాం
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఒకే రోజు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని నిరూపించామని మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎస్.సవిత అన్నారు. -
పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరిస్తాం
పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించడంపై ఎక్స్ వేదికగా గురువారం ఆయన స్పందించారు. -
రాజ్యసభ బరిలో సునేత్రా పవార్
మహారాష్ట్రలోని బారామతి నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగి ఓడిపోయిన సునేత్రా పవార్ (ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య) రాజ్యసభ ఎన్నికల బరిలో దిగారు. -
కళ్లు మూసుకుంటే ఐదేళ్లూ గడిచిపోయాయి
అలా కళ్లు మూసుకుంటే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అలాగే ఇప్పుడూ కళ్లు మూసుకుంటే 2029 వచ్చేస్తుంది. అప్పుడు మనదే అధికారం. -
ధరలను మోదీ అదుపు చేయలేరు: కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మే నెల ద్రవ్యోల్బణం గణాంకాలపై కాంగ్రెస్ పార్టీ గురువారం విరుచుకుపడింది. -
బాధ్యతగా నడుచుకుంటా: తీన్మార్ మల్లన్న
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)తో గురువారం శాసనమండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రమాణం చేయించారు.
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, న్యాయవాదుల సంబరాలు
-
నష్టాల నుంచి తేరుకుని.. కొత్త రికార్డుల్లో మార్కెట్ సూచీలు
-
భాజపాపై ఆర్ఎస్ఎస్ గుర్రు.. భాగవత్తో భేటీ కానున్న యోగి..!
-
బారామతిలో మళ్లీ పవార్ Vs పవార్.. ఈసారి ఎవరంటే..?
-
తొలి బంతికే విరాట్ వికెట్.. అదొక భావోద్వేగ క్షణం: సౌరభ్ నేత్రవల్కర్
-
రివ్యూ: హరోం హర.. సుధీర్బాబు ఖాతాలో హిట్ పడిందా?