యువత ఓటెత్తాలి
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
స్వచ్ఛంద సంస్థల ప్రచారం
ప్రజాస్వామ్య పండుగ పేరుతో కార్యక్రమాలు
ఈనాడు, హైదరాబాద్
అక్షర రూపంలో నిల్చున్న బేగంపేటలోని ఓ పాఠశాల విద్యార్థులు
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఓటు వేసేందుకు నగరవాసులు పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో వారిలో చైతన్యం నింపేలా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజాస్వామ్య పండగ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మరికొన్ని సంస్థలు పోస్టు కార్డుల ద్వారా ప్రచారాన్ని చేపడుతున్నాయి. ఇంకొన్ని సంస్థలు ‘నోటాకైనా ఓటేయండి’ అంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. నగరంలో 18 నుంచి 39 ఏళ్ల వయసున్న యువకులు సుమారు 45 శాతం మంది ఉన్నారు. కానీ ఓటు వేసేందుకు వృద్ధుల్లో ఉన్న ఉత్సాహం యువకుల్లో కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వారికి నచ్చే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్వచ్ఛంద సంస్థలు చైతన్యపరుస్తున్నాయి. మరికొన్ని సంస్థలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి.
షేపింగ్ టుమారో బై ఓటింగ్ టుడే..
యంగిస్థాన్ ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఊకదంపుడు ఉపన్యాసాలకు బదులుగా యువత మెచ్చే స్టాండప్ కామెడీ, రాక్బ్యాండ్ల ద్వారా ఓటు విలువను తెలియజేస్తోంది. 18 ఏళ్లు వచ్చాయని ఎవరో చెబితే ఓటరుగా నమోదవడం తప్ప మరే ఆలోచన లేని యువతలో మార్పు తేవాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు యంగిస్థాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అరుణ్ తెలిపారు. ‘షేపింగ్ టుమారో బై ఓటింగ్ టుడే’ పేరుతో వేర్వేరు కార్యక్రమాలు చేపడుతున్నారు. యువతకు చేరువయ్యేలా తెలంగాణ లెట్స్ఓట్, ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ పేరిట సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వారికి నచ్చే విధంగా మరికొద్ది రోజుల్లో స్టాండప్ కామెడీ, స్లాం పొయెట్రీ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు బృంద సభ్యులు తెలిపారు.
పోస్టుకార్డులతో ప్రచారం..
మెరు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పోస్టుకార్డులతో ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇందుకోసం విద్యార్థులు ఒక్కొక్కరు రెండు పోస్టు కార్డులను రూపొందించారు. వీటిని తమ బంధవులు, ఇరుగు, పొరుగు వారికి పంపతూ తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు.
యూత్ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ)..
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ) సంస్థ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ‘ఈ దేశం నాదే అంటున్నావు. దేశ పౌరుడి అని గర్వపడుతున్నావు. ఓటు నా బాధ్యత కాదు అనడం సబబేనా’ అంటూ ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. నాయకులు ఇష్టం లేకపోతే ‘నోటాకైనా సరే ఓటేయ్’ అంటూ చైతన్యపరుస్తోంది. మరికొంత మంది సభ్యులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు: మంత్రి తుమ్మల
[ 17-05-2024]
తెలంగాణకు తలమానికంగా నిలవనున్న కొహెడ పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
[ 17-05-2024]
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
వేడి నీటివల్లే బొబ్బలు.. యాసిడ్దాడి తప్పుడు ప్రచారమే: వీసీ గణేశ్
[ 17-05-2024]
నగరశివారు మోకిలలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వీసీ గణేశ్ తెలిపారు. -
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
[ 17-05-2024]
ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. -
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
[ 17-05-2024]
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
-
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
-
పాక్ వద్ద అణ్వస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు కదా! - మోదీ
-
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM