logo

కలిసికట్టుగా ‘కొండా’ను గెలిపిద్దాం: భాజపా

ప్రతి ఒక్కరు ఐక్యతగా పనిచేసి ఎంపీ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయానికి కృషిచేద్దామని ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యులు, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్‌ పటేల్‌ అన్నారు.

Published : 05 May 2024 03:25 IST

పూడూరు, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు ఐక్యతగా పనిచేసి ఎంపీ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయానికి కృషిచేద్దామని ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యులు, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్‌ పటేల్‌ అన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్‌ అధ్యక్షతన శనివారం పూడూరులో భాజపా మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో కష్టపడి పనిచేస్తే చేవెళ్ల గడ్డపై కాషాయ జెండా ఎగరవేయటం ఖాయమన్నారు. నాయకులు రాముయాదవ్‌, అనిల్‌, రవికుమార్‌గౌడ్‌, వెంకటేశ్‌ ఉన్నారు.

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: మున్సిపల్‌ పరిధిలోని ధన్నారంలో శనివారం భాజపా పట్టణ అధ్యక్షులు నరోత్తంరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, డాక్టర్‌ రాజశేఖర్‌ తదితరలు, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని