ఉపాధి పెంచుతా.. విద్య, వైద్యం అందిస్తా
‘‘హైదరాబాద్ లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారంటే ప్రధాన కారణం బోగస్ ఓట్లే. వాటిని తొలగించి ఎన్నికల అధికారులు పారదర్శకంగా పోలింగ్ నిర్వహిస్తే కచ్చితంగా మేమే విజయం సాధిస్తాం.
హైదరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా
సమీర్
‘‘హైదరాబాద్ లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారంటే ప్రధాన కారణం బోగస్ ఓట్లే. వాటిని తొలగించి ఎన్నికల అధికారులు పారదర్శకంగా పోలింగ్ నిర్వహిస్తే కచ్చితంగా మేమే విజయం సాధిస్తాం. ప్రతి ఎన్నికల్లోనూ చార్మినార్, బహదూర్పుర, యాకుత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లలో 40శాతంలోపే పోలింగ్ శాతం ఎందుకు నమోదవుతుంది? మతం పేరుతో మజ్లిస్.. భాజపాలు ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నాయి.’’అని హైదరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ వలీవుల్లా సమీర్ అన్నారు. పాతబస్తీలోని సమస్యలు, అభివృద్ధి, విద్య, వైద్యం తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.
హైదరాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడం వెనుక ప్రధాన కారణం బోగస్ ఓటర్లు. వాటిని అధికారులు ఎందుకు తొలగించడం లేదన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టంగా వ్యవహరిస్తే పాతబస్తీలో ఓటర్లు స్వేచ్ఛగా వారి అభిప్రాయాలను ఓటు ద్వారా వెల్లడిస్తారు.
కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంకా అపరిశుభ్రత ఉంది. నాలాల విస్తరణ ఆగిపోయింది. చాలా పనులు నత్తనడకన
సాగుతున్నాయి. వీటిని ఎలా పరిష్కరిస్తారు?
పాతబస్తీలో అపరిశుభ్ర వాతావరణానికి కారణం మజ్లిస్ ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ అధికారులే. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోరు. రోడ్లను వారి సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. బల్దియాది ఖాయా.. పీయా.. చల్దియా.. మాదిరిగా ఉంది. నేను గెలిస్తే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి సాయంతో సమస్యలన్నీ పరిష్కరిస్తా.
మీ గెలుపోటములను ఏయే అంశాలు ప్రభావితం చూపనున్నాయి?
ఇక్కడి ఎన్నికల్లో జాతీయ అంశాలతోపాటు భాజపా, మజ్లిస్ మతతత్వ ధోరణి ప్రభావం చూపిస్తుంది. వారికి లౌకిక భావన లేదు. మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం చేస్తున్నారు. మా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానాలను వివరిస్తున్నాం. అందుకే ప్రజలు ఆకర్షితులవుతున్నారు.
మీ ప్రత్యర్థులు ఎవరని భావిస్తున్నారు
మీ దృష్టిలో వారి బలహీనతలు ఏవి?
ప్రధాన ప్రత్యర్థి భాజపానే. రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది. వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. ఎంతోమంది విదేశాలకు వెళ్లారు. రెండో ప్రత్యర్థి మజ్లిస్. పాతబస్తీ అంటే మజ్లిస్ అనే భ్రమ కల్పించారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరు.
ఇప్పటివరకు ఏమైనా సమస్యలు గుర్తించారా.. యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ఏం చేస్తారు?
హైదరాబాద్ లోక్సభ పరిధిలో చాలా సమస్యలున్నాయి. 70 శాతం ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదు. ప్రభుత్వ, బ్యాంకులపరంగా సాయం అందక యువత చిరువ్యాపారాలు, చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. ఉపాధి కోసం అత్యధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రభుత్వం వారివైపు నిలబడి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి. ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
మీరు గెలిస్తే...మీ ప్రాధాన్య అంశాలేమిటీ?
ఎన్నికల ప్రచారంలో వేలమంది యువకులను కలుసుకున్నా. చాలామందికి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు లేక చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వారికి కావల్సింది నైపుణ్యాలు. శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి రెండేళ్లలో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తా. అర్హులైన యువకులకు బ్యాంకు రుణాలిప్పించి ఉపాధి అవకాశాలను సృష్టించుకునేలా చేస్తా. మౌలిక సదుపాయాల కల్పన, మెట్రోరైల్ ప్రాజెక్ట్, మూసీ రివర్ ఫ్రంట్ పనులను పరుగులు పెట్టిస్తా.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..