భక్తులకు కల్యాణ కష్టం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు కోడె మొక్కులతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.
భవనం సరిపోక తోపులాటలు
న్యూస్టుడే, వేములవాడ
కల్యాణాలు నిర్వహించే భవనం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు కోడె మొక్కులతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇందులో భాగంగా చాలా మంది ఆలయంలో కల్యాణాలు జరిపించుకొని మొక్కులు చెల్లించుకొంటారు. మంచి రోజుల్లో నూతన వధూవరులు, ఇతరులు స్వామివారి సన్నిధిలో కల్యాణం చేయించుకొని మొక్కు తీర్చుకొంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కల్యాణం టికెట్ తీసుకున్న భక్తులకు ఆలయం ముందు ఉన్న కళా భవనంలో అర్చకులు కల్యాణం జరిపిస్తుంటారు. ఒక టికెట్పై దంపతులను మాత్రమే అనుమతిస్తారు. వాస్తవానికి కళాభవనంలో 150 జంటలు మాత్రమే కూర్చోవడానికి హాల్ సామర్థ్యం ఉంది. అయితే ఆలయ అధికారులు మాత్రం భక్తుల ఒత్తిళ్లతో 190 నుంచి 200 వరకు కల్యాణం టికెట్లను జారీ చేస్తుంటారు. అయినప్పటికీ చాలా మందికి టికెట్లు లభించక నిరాశతో వెళ్తుంటారు. టికెట్ లభించని సందర్భంలో మరో రోజు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
మంచి రోజుల్లో ఇబ్బందులే...
మంచి రోజులు, పెళ్లిళ్ల సీజన్లో రోజూ భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇలాంటి సందర్భంలో టికెట్లు లభించక భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. టికెట్లు లభించక కొత్త జంటలు కల్యాణం మొక్కును వాయిదా వేసుకోవడమో, మరో రోజు వేచి ఉండటమో చేస్తుంటారు. రోజూ కల్యాణం టికెట్లను రూ. 1000లకు జారీ చేస్తుంటారు. ఒక టికెట్పై భార్యాభర్తలను మాత్రమే అనుమతిస్తుంటారు. బంధువులను అనుమతించరు. భక్తుల రద్దీ సమయంలో టికెట్లు లభించని వారు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు నలభై ఏళ్ల క్రితం 150 మంది జంటలు కూర్చుండే విధంగా కళా భవనం, హాల్ నిర్మించారు. ప్రస్తుతం ఏటేటా స్వామివారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యతో పాటు కల్యాణాలు చేయించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో భవనం ఏ మాత్రం సరిపోవడం లేదు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అదనంగా కల్యాణం టికెట్లు జారీ చేస్తున్నప్పటికీ ఇంకా లభించక వెనుదిరగాల్సిన పరిస్థితి కొందరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కల్యాణ మొక్కుల ద్వారా ఆలయానికి ఏటా రూ. 3.5 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ విశాలమైన భవనం నిర్మించడం లేదు. దీంతో భక్తులకు బాధలు తప్పడం లేదు.
టికెట్లు దొరకక...
కొన్ని సందర్భాల్లో కళా భవనం వద్ద కల్యాణం టికెట్ల కోసం కౌంటర్ వద్ద భక్తుల తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. నూతన వధూవరులతోపాటు పెద్ద ఎత్తున వారి బంధువులు వస్తుంటారు. వచ్చిన రోజే కల్యాణం మొక్కు తీర్చుకొని వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. ఇదే అదనుగా కొందరు దళారులు సీజన్లో టికెట్లను బ్లాక్ చేసి విక్రయించిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పటికైనా పెద్ద భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ ఉండటంతో ఆలయం వద్ద ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టడం లేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
పెద్ద హాల్ కోసం ప్రతిపాదన
కల్యాణం మొక్కులు చెల్లించుకునే భక్తులు మంచి రోజులు, సీజన్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెద్ద హాల్ నిర్మాణం అవసరముందనే విషయాన్ని దేవాదాయశాఖ అధికారులకు ప్రతిపాదన చేశాం. దాదాపు 500 మంది కూర్చుండే విధంగా విశాలమైన భవనం ఉంటే భక్తులకు ఇబ్బంది ఉండదు. ప్రస్తుత భవనం సామర్థ్యానికి మించి కల్యాణం టికెట్లు జారీ చేస్తున్నాం. అయినా చాలా మందికి లభించక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తోపులాటలు చోటుచేసుకుంటున్న విషయం వాస్తవమే.
శ్రీనివాస్, ఏఈవో, రాజన్న ఆలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
[ 16-06-2024]
లోక్సభ ఎన్నికల పర్వం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగించింది. -
నాన్న కష్టమే నడిపించింది
[ 16-06-2024]
ప్రతి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మైతే.. ప్రపంచాన్ని పరిచయం చేసేది మాత్రం నాన్నే. బిడ్డలు ఎదుగుతుంటే ఆనందిస్తాడు. తన సర్వస్వాన్ని పిల్లలకు అంకితం చేస్తాడు. జీవితాన్నే బిడ్డలకు త్యాగం చేస్తాడు. -
గుర్తింపు పత్రం అందేనా..!
[ 16-06-2024]
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం ఇవ్వడంలో ఇంకా జాప్యం కొనసాగుతూనే ఉంది. -
ఆరుద్రల ఆగమనం
[ 16-06-2024]
ఎర్రని పట్టువస్త్రాన్ని కప్పుకొన్నట్లుగా చూడముచ్చటగా కనిపించే ఈ కీటకాలు ఏడాదిలో కేవలం ఆరుద్రకార్తె ఆగమనంలోనే దర్శనమిస్తాయి కాబట్టి వీటిని ఆరుద్ర పురుగులుగానే పిలుస్తారు. -
రుణ లక్ష్య సాధనలో ప్రథమం
[ 16-06-2024]
కరీంనగర్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు లక్ష్యంతో దూసుకుపోతున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
[ 16-06-2024]
మోసపూరితమైన ఆన్లైన్ యాప్ల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని, సైబర్ నేరగాళ్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో సూచించారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
[ 16-06-2024]
ప్రైవేటు పాఠశాలల బస్సులను వాహన తనిఖీ అధికారి భీమ్సింగ్ శనివారం పరిశీలించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో