logo

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ తెలిపారు. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో

Published : 02 Jun 2023 05:46 IST

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న డీసీపీ వైభవ్‌గైక్వాడ్‌

గోదావరిఖని, న్యూస్‌టుడే: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ తెలిపారు. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదన్నారు. ప్రవర్తనలో మార్పులేకుండా, అల్లర్లు సృష్టిస్తే పీడీయాక్ట్‌ నమోదు చేస్తామన్నారు. బైండోవర్‌ తర్వాత ఏదైనా నేరానికి పాల్పడితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు మంచి ప్రవర్తనతో మెలగాని పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని