పెళ్లైన రెండు నెలలకే డబ్బుతో ఉడాయించిన యువతి
జ్యోతినగర్ అన్నపూర్ణకాలనీకి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి డబ్బు, బంగారంతో ఉడాయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జ్యోతినగర్, న్యూస్టుడే: జ్యోతినగర్ అన్నపూర్ణకాలనీకి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి డబ్బు, బంగారంతో ఉడాయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నపూర్ణకాలనీకి చెందిన సుద్దాల రేవంత్కు గతంలో వివాహం కాగా మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అనంతరం వివాహ ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన వివరాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. వరంగల్ జిల్లా నెక్కొండగా పేర్కొంటూ ఓ యువతి సమ్మతి తెలపడంతో పెద్ద మనుషుల సమక్షంలో 14-12-2022లో భీమునిపట్నంలోని చిలుకలయ్యగుడిలో వివాహం జరిపించారు. రెండు నెలలు కలిసి ఉన్న అనంతరం ఆ యువతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనకు మద్యం అలవాటు ఉందంటూ రోజూ రేవంత్ను వేధించసాగింది. ఇంట్లో గొడవ పెట్టుకొని తన సోదరి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పింది. ఫిబ్రవరిలో రూ. 70 వేల నగదు, నాలుగు తులాల బంగారం పట్టుకొని వెళ్లిపోయింది. ఆమెకు ఫోన్ చేసినా స్పందించకపోవటంతో ఆమె తల్లిదండ్రులను, స్నేహితులను రేవంత్ వాకబు చేశాడు. సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్నట్లు మార్చి నెలలో గుర్తించి తీసుకురావటానికి వెళ్లగా కొందరు బంధించి తనపై దాడి చేశారని రేవంత్ తెలిపాడు. సమీపంలోని పోలీసుస్టేషన్లో తనపైనే తప్పుడు ఫిర్యాదు చేశారని.. తనను వేధిస్తూ రూ.10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నారన్నాడు. ఆమెకు ఇదివరకే మూడు వివాహాలు అయ్యాయని రేవంత్ ఆరోపిస్తున్నాడు. ఇటీవల అతను ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి విచారణ చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై జీవన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానికం’!
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలో పదిలమైందో లేదో.. అటు నాయకులు, ఇటు అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. -
పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు
[ 17-05-2024]
వర్షాకాలంలో దోమలతో మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. దీనికి కారణం పారిశుద్ధ్యం లోపించడం, తాగునీరు కలుషితం కావడం. -
కళల మెరుపులు.. నైపుణ్యానికి మెరుగులు
[ 17-05-2024]
కరీంనగర్ బాలభవన్ వేసవి శిక్షణ శిబిరం సందడిగా మారింది. గతంతో పోల్చితే ఈసారి అధిక మంది శిక్షణ పొందుతున్నారు. పిల్లలంతా స్వేచ్ఛగా తమకు నచ్చిన అంశాలు నేర్చుకుంటున్నారు. -
హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
[ 17-05-2024]
రాష్ట్రంలో రైతులను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చొప్పదండిలో భారాస నేతలతో కలిసి నిరసన తెలియజేసి మాట్లాడారు. -
ఉప కులపతిగా అవకాశం దక్కేదెవరికో?
[ 17-05-2024]
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం ఈనెల 21తో ముగియనుండంతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. -
ఓట్ల పండుగ.. ఆర్టీసీకి ఆదాయం దండిగా!
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అధిక మంది వారివారి స్వస్థలాలకు బయలుదేరారు. పిల్లలకు కూడా వేసవి సెలవులు కావడంతో తమ ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపారు. -
నారసింహుడి కోవెలలో నగదు రహిత సేవలకు శ్రీకారం
[ 17-05-2024]
దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నగదు రహిత సేవలకు శ్రీకారం చుట్టారు. -
పెరిగిన గడువు.. అవకాశం మెరుగు
[ 17-05-2024]
సింగరేణిలో ఉద్యోగ నియామకాలకు మరి కొంత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. మే 4 వరకు దరఖాస్తులకు చివరి గడువు విధించిన యాజమాన్యం తాజాగా జూన్ 4 వరకు పెంచింది. -
అకాల వర్షాలతో అన్నదాతల్లో ఆందోళన
[ 17-05-2024]
అకాల వర్షాలు, ఈదురు గాలులు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
‘పల్లె’వించిన చైతన్యం..
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంలో పల్లెలు స్ఫూర్తి చాటాయి. నగర వాసుల కంటే గ్రామీణ ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. -
సహజ వనరులను కొల్లగొడుతున్నారు
[ 17-05-2024]
ఇసుక, మట్టి అక్రమ రవాణాతో జిల్లాలోని సహజవనరులను అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారు. మానేరు వాగు నుంచి ఇసుక రవాణాపై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు గాలికి వదిలేయడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. -
అనుసంధాన మార్గం పూర్తయ్యేనా!
[ 17-05-2024]
నిత్యం రద్దీగా ఉండే గ్రామాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం ఆది నుంచీ నిర్లక్ష్యానికి గురవుతోంది.నిత్యం రద్దీగా ఉండే గ్రామాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం ఆది నుంచీ నిర్లక్ష్యానికి గురవుతోంది. -
ప్రారంభించారు... తాళం వేశారు
[ 17-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఆరోగ్య ఉప కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించింది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలను పాలకులు ఆర్భాటంగా ప్రారంభించారు. -
రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే
[ 17-05-2024]
పార్లమెంటు ఎన్నికల తర్వాత ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామనడం రైతాంగాన్ని మరోసారి మోసం చేయడమేనని భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. -
ముందుకు సాగని ఆలయ విస్తరణ పనులు
[ 17-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీబద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. -
లైసెన్స్ లేకుండా మందులు విక్రయించిన వ్యక్తికి ఏడాది జైలు
[ 17-05-2024]
లైసెన్స్ లేకుండా అల్లోపతి మందులు నిల్వచేయడంతోపాటు అమ్మకాలు చేపట్టిన ఓ వ్యక్తికి కోరుట్ల న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించింది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
[ 17-05-2024]
పెద్దపల్లిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రామగుండం జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!