logo

పెళ్లైన రెండు నెలలకే డబ్బుతో ఉడాయించిన యువతి

జ్యోతినగర్‌ అన్నపూర్ణకాలనీకి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి డబ్బు, బంగారంతో ఉడాయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 04 Jul 2023 04:48 IST

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే: జ్యోతినగర్‌ అన్నపూర్ణకాలనీకి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి డబ్బు, బంగారంతో ఉడాయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నపూర్ణకాలనీకి చెందిన సుద్దాల రేవంత్‌కు గతంలో వివాహం కాగా మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అనంతరం వివాహ ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన వివరాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. వరంగల్‌ జిల్లా నెక్కొండగా పేర్కొంటూ ఓ యువతి సమ్మతి తెలపడంతో పెద్ద మనుషుల సమక్షంలో 14-12-2022లో భీమునిపట్నంలోని చిలుకలయ్యగుడిలో వివాహం జరిపించారు. రెండు నెలలు కలిసి ఉన్న అనంతరం ఆ యువతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనకు మద్యం అలవాటు ఉందంటూ రోజూ రేవంత్‌ను వేధించసాగింది. ఇంట్లో గొడవ పెట్టుకొని తన సోదరి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పింది. ఫిబ్రవరిలో రూ. 70 వేల నగదు, నాలుగు తులాల బంగారం పట్టుకొని వెళ్లిపోయింది. ఆమెకు ఫోన్‌ చేసినా స్పందించకపోవటంతో ఆమె తల్లిదండ్రులను, స్నేహితులను రేవంత్‌ వాకబు చేశాడు. సికింద్రాబాద్‌ తిరుమలగిరిలో ఉన్నట్లు మార్చి నెలలో గుర్తించి తీసుకురావటానికి వెళ్లగా కొందరు బంధించి తనపై దాడి చేశారని రేవంత్‌ తెలిపాడు. సమీపంలోని పోలీసుస్టేషన్‌లో తనపైనే తప్పుడు ఫిర్యాదు చేశారని.. తనను వేధిస్తూ రూ.10 లక్షలు కావాలని డిమాండ్‌ చేస్తున్నారన్నాడు. ఆమెకు ఇదివరకే మూడు వివాహాలు అయ్యాయని రేవంత్‌ ఆరోపిస్తున్నాడు. ఇటీవల అతను ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి విచారణ చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై జీవన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని