logo

కాంగ్రెస్‌ నేతలకు మానసిక చికిత్స అవసరం

కాంగ్రెస్‌ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్‌లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కి వినతిపత్రం అందజేశారు.

Published : 20 Apr 2024 05:00 IST

ఎంపీకి వినతిపత్రం అందజేస్తున్న హుస్నాబాద్‌ నాయకులు

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్‌లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి హుస్నాబాద్‌ నియోజకవర్గం సహా కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కొందరు కాంగ్రెస్‌ నేతలు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వద్దకు వెళ్లడానికి భయపడే పరిస్థితి నెలకొందని తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాలోతు రాజునాయక్‌, బానోతు రవీందర్‌, తిరుపతినాయక్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని