logo

ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!

పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు.

Published : 03 May 2024 03:03 IST

కోరుట్ల, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. కొంతమందికి ఎన్నికల నిర్వహణపై గతంలోనే శిక్షణ ఇవ్వగా, మిగతా వారికి త్వరలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఉద్యోగులకు ఎన్నికల విధులు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు ఉద్యోగులకు 020-కోరుట్ల, 021-జగిత్యాల శాసనసభ నియోజకవర్గాల్లో రెండుచోట్ల ఒకేరోజు ఎన్నికల విధులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ కావడంతో అయోమయానికి లోనవుతున్నారు. ఎన్నికల రోజు ఒకస్థానంలో రిజర్వ్‌గా ఉంచగా, మరోచోట విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారు ఈనెల 12న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని పంపిణీ కేంద్రాల్లో హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో రెండుచోట్ల విధులకు హాజరుపై ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని