logo

భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి

భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Published : 03 May 2024 03:07 IST

మంథని అంబేడ్కర్‌ కూడలిలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌

కమాన్‌పూర్‌, ముత్తారం, మంథని, న్యూస్‌టుడే : భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కమాన్‌పూర్‌, రామగిరి, ముత్తారం మండలాలల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంథనిలో రాత్రి నిర్వహించిన ర్యాలీలో గోమాసె మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కులేదని విమర్శించారు.  ఈ ప్రాంత సమస్యలపై అవగాహన లేని వారు గెలిస్తే అభివృద్ధి గగనమేనని ఎద్దేవా చేశారు. ఎంపీ వెంకటేష్‌ , భాజపా జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నారాయణరెడ్డి, మండలాధ్యక్షుడు అజయ్‌, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని