logo

‘పని చేయని నాయకులను నిలదీయాలి’

అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి పనిచేయని నాయకులను నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

Published : 04 May 2024 04:44 IST

ఇందల్‌వాయి, న్యూస్‌టుడే: అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి పనిచేయని నాయకులను నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని గన్నారం, మేగ్యానాయక్‌తండా, నల్లవెల్లి, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేక ఆ పార్టీ నాయకులు పారిపోతారని ఎద్దేవా చేశారు. గతంలో పాలించిన కాంగ్రెస్‌ బీడీ కార్మికులకు పెన్షన్‌, కర్షకులకు రైతుబంధు, రైతుబీమా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్‌ అయిదేళ్లు కాలయాపన చేశారని, గెలిచిన వెంటనే పసుపు బోర్డు, గల్ఫ్‌ పాలసీ తెస్తానని మోసం చేశారని ఆరోపించారు. 13న జరిగే పోలింగ్‌లో తనకు ఓటు వేసి కాంగ్రెస్‌, భాజపాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ రమేష్‌నాయక్‌, జడ్పీటీసీ సభ్యురాలు సుమనారెడ్డి, మండలాధ్యక్షుడు దాసు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని