ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి
అన్నదమ్ముల కుమారులు మృత్యువాత
శ్రీనివాస్ మహేశ్
బుగ్గారం, న్యూస్టుడే: ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బుగ్గారం ఎస్ఐ శ్రీధర్రెడ్డి కథనం మేరకు.. గోపులాపూర్కు చెందిన దీటి శ్రీనివాస్ రెండేళ్ల క్రితం తన ఇంటి పక్కనే మరో ఇంటిని కొనుగోలు చేశాడు. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన బుర్ర నవీన్ ఇల్లు ఉంది. ఇంటి కొనుగోలు, రహదారి విషయంలో నవీన్కు శ్రీనివాస్కు తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం రాత్రి కూడా శ్రీనివాస్, నవీన్ కుటుంబాల మధ్య గొడవ జరిగి సద్దుమణిగింది. అనంతరం శ్రీనివాస్ పెద్దనాన్న కొడుకైన దీటి మహేశ్ ఇంటికి వెళ్లాడు. అక్కడికి నవీన్ కొంతమంది యువకులతో కలిసి వచ్చి శ్రీనివాస్(36)పై కర్రలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహేశ్(38)పై కూడా దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మహేశ్ ఉపాధి కోసం ముంబయి వెళ్లి రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్కు వివాహమైంది. శ్రీనివాస్ సోదరి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపాడు. సంఘటన స్థలాన్ని అదనపు ఎస్పీ వినోద్కుమార్ పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బల్దియా అక్రమాలపై నజర్
[ 17-06-2024]
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యకలాపాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల అభివృద్ధి పనులు, పట్టణ ప్రణాళికపై వరుస ఫిర్యాదులు వస్తుండటంతో ఆ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. -
ఆడపిల్లలపై వీడని వివక్ష
[ 17-06-2024]
జిల్లాలో బాలికల సంఖ్య తగ్గుతోంది. ఆడపిల్ల అంటేనే కొందరు తల్లిదండ్రులు నిరాసక్తత చూపడంతో వారి సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. -
సిబ్బంది కొరత.. శిథిల భవనం
[ 17-06-2024]
గంగాధరలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమస్యలు వేధిస్తున్నాయి. సరిపడా సిబ్బంది లేక.. శిథిల భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కనీస వసతులు లేక కార్యాలయానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఆలయ మాన్యాలకు శఠగోపం
[ 17-06-2024]
దేవుడి మాన్యాలకూ రక్షణ కరవైంది. రూ.కోట్ల ఆస్తులున్నప్పటికీ ఆదాయం లేక ఆలయాల నిర్వహణ భారంగా మారింది. -
పేద విద్యార్థుల ప్రతిభకు పట్టం
[ 17-06-2024]
వారంతా పేద విద్యార్థులు.. అయినా వారిలో ప్రతిభకు కొదవలేదు. చదివేది ప్రభుత్వ పాఠశాలలోనైనా పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని జాతీయ ప్రతిభ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. -
సాగులో సస్యరక్షణ చర్యలే కీలకం
[ 17-06-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పత్తి, ఇతర పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కొద్దిపాటి వర్షానికే ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు విత్తుకున్నారు. వరి సాగుకు నారును సిద్ధం చేశారు. తీరా వర్షం కురవకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. -
సృజన ఆవిష్కృతం.. విజ్ఞాన సమ్మిళితం
[ 17-06-2024]
ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసేందుకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
భార్య జ్ఞాపకం.. గుడితో పదిలం
[ 17-06-2024]
భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె జ్ఞాపకాలు గుర్తుండేలా గుడి నిర్మించాడు ఓ భర్త.. నిత్యం ఆ గుడిలో దీపం వెలిగించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. -
శాశ్వత చర్యలు ఎక్కడ?
[ 17-06-2024]
వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఏటా వరదలు సంభవించి కాలనీలు జలమయమవడం, ఇళ్ల నుంచి ప్రజలు బయటకురాని పరిస్థితులు నెలకొన్నా ముప్పు నివారణకు పాలకులు శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. -
సంస్కరణల అమలుతోనే అభివృద్ధి
[ 17-06-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ఆలయాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురిలో రానున్న రోజుల్లో పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అరకొర వసతులు.. మొక్కుబడి పరీక్షలు
[ 17-06-2024]
ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక వాహనాల రిజిస్ట్రేషన్లతో యూనిట్ కార్యాలయం నుంచి ఆర్టీవో స్థాయికి ఉన్నతి పొందిన పెద్దపల్లి రవాణా శాఖ అద్దె భవనంలో అరకొర వసతులతోనే కాలం వెళ్లదీస్తోంది. -
ధరణి సమస్యలకు పరిష్కారం లభించేనా!
[ 17-06-2024]
ధరణి సమస్యల పరిష్కారంపై కదలిక వచ్చింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్ దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
దుకాణాలను మింగిన రహదారి
[ 17-06-2024]
మండల కేంద్రమైన రుద్రంగి ప్రధాన రహదారి గుట్టను ఆనుకొని ఎత్తు ప్రదేశంలో ఉంటుంది. ఇలాంటి రహదారిని ఎత్తుగా నిర్మించే క్రమంలో పాత రహదారిపై ఉన్న మట్టిని తొలగించకుండానే కొత్తగా వేయడంతో మరింత ఎత్తు పెరిగి దాని వెంబడి దుకాణాలు నిండా మునిగాయి. -
నీరు పారదు.. పంట తడవదు
[ 17-06-2024]
కాల్వల్లో పెరిగిన చెట్లు.. పూడికతో నిండిన మట్టి.. పగుళ్లు బారిన లైనింగ్, ధ్వంసమైన డిస్ట్రిబ్యూటరీలు. కొన్ని చోట్ల అసలు కాల్వల నామరూపాల్లేకుండా పోయాయి. -
చెక్డ్యాంల రక్షణ గోడలకు మరమ్మతులు
[ 17-06-2024]
భూగర్భ జలాలను పెంపొందించేందుకు, వ్యవసాయ, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉండేలా ప్రభుత్వం మూలవాగులో చెక్డ్యాంల నిర్మాణం చేపట్టింది. అయితే గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రక్షణ గోడలు కోతకు గురయ్యాయి. -
మంత్రికి మగ్గంపై నేసిన చిత్రపటం బహూకరణ
[ 17-06-2024]
చేనేత మగ్గంపై నేసిన బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాన్ని ఆదివారం టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ హుస్నాబాద్లో ఆయనను కలిసి బహూకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల వేళ.. మణిపుర్ పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
-
ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
-
రైల్వే ట్రాక్పై 10 సింహాలు.. లోకోపైలట్ ఏం చేశారంటే!
-
కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి పంకజ ముండే
-
‘పుష్ప 2’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM