logo

సేవలను వినియోగించుకోండి

ప్రతిభావంత పేద విద్యార్థుల కోసం తాము ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్‌ సేవలను వినియోగించుకోవాలని పీఈఎస్‌ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఆచార్య ఎంఆర్‌ దొరెస్వామి పిలుపునిచ్చారు.

Published : 30 May 2023 02:47 IST

జ్యోతి వెలిగిస్తున్న ఆచార్య ఎంఆర్‌ దొరెస్వామి

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: ప్రతిభావంత పేద విద్యార్థుల కోసం తాము ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్‌ సేవలను వినియోగించుకోవాలని పీఈఎస్‌ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఆచార్య ఎంఆర్‌ దొరెస్వామి పిలుపునిచ్చారు. స్టడీ సర్కిల్‌ వార్షికోత్సవంలో భాగంగా ఉన్నత శ్రేణిలో మార్కులు పొందిన విద్యార్థులకు, ఉపాధి అవకాశాలు దక్కించుకున్న 250 మంది అభ్యర్థులకు ఆయన ప్రమాణ పత్రాలు అందజేసి మాట్లాడారు. ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులు భావన, వైష్ణవిలకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. ట్రస్టు ప్రతినిధులు కె.సుబ్రహ్మణ్య నాయుడు, ప్రత్తిపాటి ఆంజనేయులు, ఎం.నరసింహప్ప, శివరావు, రామకృష్ణ, సూరిబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని