logo

వికసిత భారత్‌ సాధనే లక్ష్యం

దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు.

Published : 28 Mar 2024 03:07 IST

మైసూరు, న్యూస్‌టుడే : దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి గద్దెనెక్కాలని కోరుకుంటున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర పేరొన్నారు. విశ్వగురువుగా గుర్తింపు దక్కించుకుని వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేసే దిశలో మోదీ ముందడుగు వేస్తున్నారని తెలిపారు. చాముండి బెట్టపై అమ్మవారిని విజయేంద్ర బుధవారం దర్శించుకున్నారు. మడికేరిలో సాయంత్రం నిర్వహించిన పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మైసూరు- కొడగు లోక్‌సభ అభ్యర్థి యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయరును భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని కోరారు. పార్టీ నాయకులు విజయేంద్రను సత్కరించి, కొడవ సంప్రదాయ కత్తిని అందించారు. యదువీర్‌ ఒడెయరు, పార్టీ  నాయకులు ప్రతాప సింహ, ఎస్‌ఏ రామదాస్‌, కేజీ బోపయ్య, శరణు తళ్లికేరి, రవి కాళప్ప తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

మైసూరులో నిర్వహించిన మరో కార్యక్రమంలో యదువీర్‌ నాయకత్వాన్ని బలపరచి గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పిలుపునిచ్చారు. విజయేంద్ర తదితరులతో కలసి ఆయన ప్రచార సభలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని