logo

ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం

భర్త గోపాల్‌ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది.

Published : 29 Mar 2024 03:24 IST

తన కుమార్తెలతో అనిత

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే : భర్త గోపాల్‌ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. వారిని సకాలంలో గుర్తించిన కొందరు ఆస్పత్రికి తరలించారు. కర్ణాటకాంధ్ర సరిహద్దు చిలమత్తూరు సమీపంలోని మరువకుంట పల్లికి చెందిన అనిత (30), ఆమె కుమార్తెలు లావణ్య (11), ధరణి (9), కావ్య (8), రక్షిత (5), శ్రీవల్లి (2) ప్రస్తుతం చిక్కబళ్లాపుర ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. భర్తతో కలిసి బాగేపల్లి సమీపంలోని ఒక గ్రామంలో బాధితురాలు ఉంటోంది. విషం తాగిన వీరికి బాగేపల్లి తాలూకా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్స కోసం చిక్కబళ్లాపుర జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనితను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు గర్భిణి అని వైద్యులు తెలిపారు. బాగేపల్లి గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని