నలుగురు బాలలు ఈతకు వెళ్లి నీటిపాలు
పాఠశాలలకు సెలవులు ఉండడంతో ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఆ నలుగురు బాలురు నీట మునిగి మృతి చెందిన ఘటన హాసన జిల్లా ఆలూరు తాలూకా ముత్తిగె గ్రామంలో గురువారం విషాదం నింపింది.
హాసన, న్యూస్టుడే : పాఠశాలలకు సెలవులు ఉండడంతో ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఆ నలుగురు బాలురు నీట మునిగి మృతి చెందిన ఘటన హాసన జిల్లా ఆలూరు తాలూకా ముత్తిగె గ్రామంలో గురువారం విషాదం నింపింది. మృతులను జీవన్, సాధ్విక్, విశ్వ, పృథ్విగా గుర్తించారు. వీరంతా ఐదో తరగతి బాలలు. అగ్నిమాపకదళ సిబ్బందితో కలిసి ఆలూరు గ్రామీణ ఠాణా పోలీసులు మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీశారు. ఆ చిన్నారులను చూసి ఊరంతా కంట తడిపెట్టింది.
బెదిరించబోయి.. కడతేరిపోయాడు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : ఆత్మహత్య చేసుకుంటున్నానని భార్యకు వీడియో కాల్ చేసి బెదిరిస్తున్న సమయంలో హఠాత్తుగా మెడకు ఉరి బిగుసుకుని అమిత్ కుమార్ (28) అనే యువకుడు మృతి చెందాడు. బిహారుకు చెందిన బాధితుడు దాసరహళ్లిలో ఉంటూ జిమ్ తర్ఫీదుదారునిగా ఉపాధి కల్పించుకున్నాడు. గత ఏడాదే ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం అతని భార్య నర్సింగ్ కోర్సులో చేరింది. భర్తతో గొడవ పడి రెండు వారాల కిందటే పుట్టింటికి వెళ్లింది. తిరిగి రావాలని ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడంతో ఉరి వేసుకుంటున్నానని బుధవారం రాత్రి వీడియో కాల్ చేశాడు. చేతిలో ఉన్న చరవాణి జారి పడడంతో, దాన్ని పట్టుకునే ప్రయత్నంలో పీట పైనుంచి జారి కింద పడ్డాడు. ఉరి బిగుసుకుని మృతి చెందాడని బాగలగుంటె ఠాణా పోలీసులు వెల్లడించారు.
విద్యార్థిని అనుమానాస్పద మృతి
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : ఓ ప్రైవేటు కళాశాలలో రెండో ఏడాది డిగ్రీ చదువుతున్న ప్రభుధ్యా (21) అనే విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన ఇంటి స్నానాల గదిలో ఆమె మృతదేహాన్ని గురువారం గుర్తించారు. గొంతు కోయడంతోనే ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం గుర్తించవలసి ఉందని చెప్పారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదు నేపథ్యంలో అసహజ మృతిగా సుబ్రహ్మణ్యపుర ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెల్లెళ్లను వెంటాడుతున్న యువకుడిని కడతేర్చిన అన్న
బెళగావి, న్యూస్టుడే : యువతుల వెంటబడుతున్న గాంధీనగర నివాసి ఇబ్రహీం గౌస్ (22) అనే యువకుడు కడతేరిపోయాడు. ఆ యువతుల సోదరుడు- ముజామిల్ సత్తిగేరి అనే యువకుడు ఆగ్రహంతో గౌస్ను గురువారం హత్య చేశాడని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమించే వాడు ఒకరితోనే మాట్లాడతాడని.. తన చెల్లెళ్లు ఇద్దరినీ వేధిస్తున్న నీ ప్రవర్తన మార్చుకోవాలని అతన్ని ముజామిల్ పలుసార్లు హెచ్చరించాడు. అతను తీరు మార్చుకోకపోవడంతో మహంతేశ్ లేఅవుట్ వద్ద స్క్రూ డ్రైవరుతో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన గౌస్ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించాకా చికిత్స పొందుతూ మరణించాడు. పరారీలో ఉన్న నిందితుని కోసం మాళ మారుతి ఠాణా పోలీసులు గాలింపు చేపట్టారు.
గర్భంలో బిడ్డను తీసి.. గుడ్డను వదిలేశారు
కోలారు, న్యూస్టుడే : కాన్పు కోసం ఆసుపత్రిలో చేరిన చంద్రిక అనే మహిళ మే ఐదున కోలారు జిల్లాసుపత్రిలో చేరారు. అదే రోజు శస్త్రచికిత్స (సిజేరియన్) చేసి వైద్యులు కాన్పు చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెకు కడుపునొప్పి తీవ్రం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. స్కానింగ్లో చంద్రిక కడుపులో మూడు అడుగుల పొడవైన వస్త్రం ముక్క ఉండిపోయినట్లు గురువారం గుర్తించారు. ఆమెకు అవసరమైన సపర్యలకు ఉపక్రమించారు. సిజేరియన్ సమయంలో రక్తస్రావాన్ని నిలిపేందుకు అడ్డుగా ఉంచిన ఆ వస్త్రం ఉండను తీయకుండానే కుట్లు వేశారని చంద్రిక భర్త రాజేశ్ ఆరోపించారు. వైద్యులు నాగవేణి, విజయ్ జుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోలారు నగర ఠాణా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ్వాంద్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
నీట్ అక్రమాలపై వెల్లువెత్తిన నిరసన
[ 13-06-2024]
నీట్ ప్రవేశ పరీక్షలో చోటుచేసుకున్న అవినీతిపై కొప్పళలో ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై నిష్పక్షపాత దర్యాప్తు చేయించాలని కోరారు. -
గ్యారంటీలపై పునరాలోచన?
[ 13-06-2024]
మొన్నటికిమొన్న లోక్సభ ఎన్నికలకన్నా ముందు.. విధానసభ పోరులో కాంగ్రెస్ సాధించిన ఘన విజయానికి దోహదపడిన అంశాల్లో ఐదు గ్యారంటీలే కీలకం. ఇక్కడ కాంగ్రెస్ రూపొందించిన గ్యారంటీల పథకాలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. -
హైకోర్టు మెట్లెక్కిన అప్ప
[ 13-06-2024]
పోక్సో కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడియూరప్పకు సదాశినగర ఠాణా పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. -
దర్శన్పై రౌడీషీట్?
[ 13-06-2024]
తనతో సహజీవనం చేస్తున్న పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపించాడని చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి (28)ని హత్య చేసిన కేసులో కథానాయకుడు దర్శన్పై రౌడీషీటు తెరిచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. -
అది.. అత్యాచారం కాదు
[ 13-06-2024]
వివాహం చేసుకుంటానని నమ్మించి, శారీరక సంబంధాన్ని పెట్టుకుని కొన్నేళ్ల అనంతరం మాట తప్పితే అది అత్యాచారం కింద కేసు నమోదు చేయడం కుదరదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. -
ప్రియుడిని కడతేర్చిన ప్రేయసి
[ 13-06-2024]
సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రాజేశ్ (32) అనే వ్యక్తిని ప్రేమ (34) అనే మహిళ తన సోదరుడు శివు (32)తో కలిసి హత్య చేసింది. -
పాక్కు మద్దతుగా నిందితుడి నినాదాలు
[ 13-06-2024]
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏడీజీపీ అలోక్ కుమార్లను హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడి అరెస్టయిన శాకిర్ మహ్మద్ అలియాస్ జయేశ్కాంత్ పూజారి పాకిస్తాన్కు మద్దతుగా కోర్టు ఆవరణలో నినాదాలు చేశాడు. -
దేశభక్తికీ పెను ముప్పు
[ 13-06-2024]
కర్ణాటకలో భారత్ మాతా కీ జై అన్నా తప్పేనని విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. గూండాల చేతికి ప్రభుత్వం అధికారాన్ని అప్పగించిందని దుయ్యబట్టారు. -
మహిళలపై ఎన్నాళ్లీ దాడులు?
[ 13-06-2024]
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగాయని వివిధ మహిళా సంఘాల నేతలు, కార్యకర్తలు స్థానిక స్వాతంత్య్ర ఉద్యానవనంలో బుధవారం ధర్నాకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
భారత కంపెనీల ‘బ్రాండ్’ బాజా.. టాప్ 100లో ఈ నాలుగింటికి చోటు
-
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రచార ప్రభుత్వం కాదు: తెదేపా ఎంపీ కలిశెట్టి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వర్చువల్ క్రెడిట్ కార్డ్ గురించి ఈ విషయాలు తెలుసా?
-
విరాట్.. కాస్త ఓర్పు ప్రదర్శించు చాలు: గావస్కర్