దేశంలో భాజపా గెలిచే అవకాశం లేదు: కూనంనేని
లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా గెలిచే ప్రసక్తి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేశంలో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 192 లోక్సభ స్థానాల్లో మెజార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చిత్రంలో జితేందర్రెడ్డి, బాగం, పోటు ప్రసాద్, మౌలానా
ఖమ్మం మామిళ్లగూడెం: లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా గెలిచే ప్రసక్తి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేశంలో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 192 లోక్సభ స్థానాల్లో మెజార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు. భాజపాకు, ప్రధాని నరేంద్రమోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెట్టించి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దిల్లీ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరేన్లను అరెస్టు చేశారని, ఈ తరహాలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సైతం ఇబ్బంది పెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రసంగించారనే వీడియోను సీఎం రేవంత్రెడ్డి షేర్ మాత్రమే చేశారని, దీనిపై దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సైతం పలు సభలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీకి నోటీసులు మాత్రమే ఇచ్చారని, విచారణకు హాజరు కావాలని ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేదని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా ఎక్కువ అసత్య, అసంబద్ధ దుష్ప్రచారాలను చేసేది భాజపా నేతలేనని విమర్శించారు. భాజపాను నడిపించే ఆరెస్సెస్ ముఖ్య ఉద్దేశం దేశ అభివృద్ధి కాదని, అనేక సందర్భాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు సైతం రిజర్వేషన్లు రద్దు చేస్తారేమోనన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయని, దీనిపై భాజపా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో సీపీఐ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి సమావేశం గురువారం జరుగుతుందని తెలిపారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కె.జానీమియా పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ విత్తనాల అమ్మితే కఠిన చర్యలు
[ 03-06-2024]
మండలంలో రైతులకు నకిలీ విత్తనాల అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కామేపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారిని తారా దేవి అన్నారు. -
మామిడి కాయల బస్తాల్లో తరలిస్తున్న గంజాయి పట్టివేత
[ 03-06-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 477 కిలోల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. -
విత్తన విక్రయ దుకాణాల తనిఖీ
[ 03-06-2024]
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో విత్తనాల విక్రయ దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల సోమవారం తనిఖీ చేశారు. -
సీఆర్పీఎఫ్ ప్రజాసేవ కోసం పని చేస్తుంది
[ 03-06-2024]
శాంతిభద్రతల పర్యవేక్షణలో ప్రజల రక్షణ కోసం సీఆర్పీఎఫ్ పనిచేస్తుందని ఆ సంస్థ- 2004 కోబ్రా కమాండెంట్ రతుల్ దాస్ స్పష్టం చేశారు. -
ముగిసిన తెలంగాణ దశాబ్ది వేడుకలు
[ 03-06-2024]
అశ్వారావుపేటలో భారాస ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ముగిశాయి. -
ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా
[ 03-06-2024]
మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారం ఎదుట ఐఎన్టీయూసీ, మిత్రపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. -
పదేళ్ల ప్రస్థానం.. భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకం: కలెక్టర్
[ 03-06-2024]
తెలంగాణ దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏళ్ల పోరాట చరిత్ర, పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని తలుచుకుంటూ... భవిష్యత్తు పురోగమనానికి ప్రేరణగా మలుచుకుందామని కలెక్టర్ గౌతమ్ అన్నారు. -
కుంచె కదిపితే.. జీవమొలికే చిత్రం!
[ 03-06-2024]
డే: వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు.. కుంచె పట్టారంటే అద్భుతమైన కళాకారుడు. చిత్ర కళల్లో నూతన ఒరవడులు సృష్టించి ప్రత్యేక చిత్రాలు రూపొందించటం ఆయన ప్రత్యేకత. -
వేసవిలో... దాహార్తి తీర్చే నేస్తం!
[ 03-06-2024]
‘దాహం తీర్చడం గొప్ప సేవ, అదృష్టంగా భావిస్తున్నా. పింఛనులో కొంత మొత్తాన్ని సంచార చలివేంద్రానికి ఖర్చుచేస్తున్నా. ఎండకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైతే చాలు, నా వాహనం బయటకు బయల్దేరుతుంది. -
ఇద్దరి ప్రాణాలు తీసిన నీటి ట్యాంకర్
[ 03-06-2024]
సంతోషంగా హైదరాబాద్ నగరాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకుల్లో ఇద్దరిని వాటర్ ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించిన ఘటన ఇది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
వడదెబ్బతో ఐదుగురి దుర్మరణం
[ 03-06-2024]
ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం వడదెబ్బతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. -
ప్రజాతీర్పు..లెక్కల కూర్పు
[ 03-06-2024]
లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు క్రతువుకు రంగం సిద్ధమైంది. కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప 2’ సాంగ్.. 500 మందికిపైగా డ్యాన్సర్లు: కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య
-
కూడలిలో కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడి ముగ్గురి మృతి!
-
టోర్నీ చరిత్రలోనే అత్యధికం.. టీ20 వరల్డ్కప్ విన్నర్కు ప్రైజ్మనీ ఎంతంటే..?
-
వైకాపా హింసకు పాల్పడొచ్చు.. కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు
-
బీచ్లో ఒకరు.. నీటిగుంతలో మరొకరు.. గల్లంతైన యువకులు
-
తాజ్ఎక్స్ప్రెస్ రైలులో మంటలు.. ప్రయాణికులంతా సేఫ్!