విధులకు పిలుపెన్నడు?
ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఆ ప్రకటన
657 మంది క్షేత్ర సహాయకుల ఎదురుచూపులు
పెనుబల్లి, చంద్రుగొండ, న్యూస్టుడే
పెనుబల్లి మండలంలో గంగదేవిపాడులో ఉపాధి హామీ
పని ప్రదేశంలో కూలీలను ఫొటో తీసి అప్లోడ్ చేస్తున్న మేట్
ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఆ ప్రకటన చేసి దాదాపు రెండు నెలలు దాటినా ఉత్తర్వులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.
* కూలీల హాజరు, ఫొటోలు ఆప్లోడ్ చేయడం వంటి పనులను మొన్నటి వరకు పంచాయతీ కార్యదర్శులు చూసేవారు. తాజాగా వారి నుంచి సీనియర్ మేట్లకు బాధ్యతలు అప్పగించారు.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా..
వేసవి సీజన్లోనే కూలీలకు బాగా పని దొరుకుతుంది. గ్రామసభల తీర్మానాల మేరకు ఆయా గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో రోజుకు దాదాపు 1.03లక్షల మంది, భద్రాద్రి జిల్లాలో 72 వేల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఉపాధి పనుల చిత్రాలు ఆప్లోడ్ చేసేందుకు 10,266 మంది, భద్రాద్రి జిల్లాలో 7718 మంది మేట్లు పని చేస్తున్నారు. 2022-23 సంవత్సరానికి ఖమ్మం జిల్లాలో 50,491 పనులు గుర్తించగా వాటిలో 30,958 పనులు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో 39,889 పనులు గుర్తించగా, 22,254 పనులు జరుగుతున్నాయి.
పెరుగుతున్న పనిభారం..
ఉపాధి పనుల్లో పారదర్శకత పెంచడానికి కేంద్రం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం అమల్లోకి తీసుకొచ్చింది. పని ప్రదేశంలో కూలీల చిత్రాలు తీసి వెబ్సైట్లో ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కూలీల సంఖ్య అధికంగా ఉన్న గ్రామాల్లో, పంచాయతీల్లో చిత్రాలు తీయడం, హాజరు నమోదులో ఇబ్బంది ఏర్పడుతోంది. 200 నుంచి 300 కూలీల హాజరు చిత్రాలు తీసుకోవడానికి మధ్యాహ్నమవుతోందని మేట్లు పేర్కొంటున్నారు. క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.
‘అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు క్షేత్ర సహాయకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. 65 రోజులు దాటినా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉపాధి పనులు జోరుగా సాగుతున్న సమయంలో విధుల్లోకి తీసుకుంటే కూలీలకు ఇబ్బందులు తప్పుతాయి.’
- కర్రి సదానందం, ఉపాధి క్షేత్ర సహాయకుల జిల్లా అధ్యక్షులు
గతంలో క్షేత్ర సహాయకులు..
ఖమ్మం: 420
భద్రాద్రి: 237
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ విదానం.. ప్రత్యక్ష ప్రసారం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. -
నేటితో ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాల ఎర
[ 11-05-2024]
సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుతోంది. కీలకమైన ప్రచార పర్వానికి శనివారం సాయంత్రం తెరపడనుంది. -
ఓటుహక్కు వినియోగించుకోండి
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ గౌతమ్ పిలుపునిచ్చారు. -
ఖమ్మం నగరానికి పాలేరు నీటి విడుదల
[ 11-05-2024]
ఖమ్మం నగరవాసుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వకు నీటిని శుక్రవారం విడుదల చేశారు. -
రెండు గంటలకోసారి పోలింగ్ శాతాల వెల్లడి: కలెక్టర్
[ 11-05-2024]
జిల్లాలోని పోలింÞ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. హైదరాబాë్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. -
బంగారు కవచాల అలంకారంలో రామయ్య దర్శనం
[ 11-05-2024]
భద్రాచల రామాలయంలో స్వామివారు శుక్రవారం బంగారు కవచాల అలంకారంలో దర్శనమిచ్చారు. -
జాతి భవిష్యత్తు కోసమే భాజపాకు మద్దతు
[ 11-05-2024]
ముప్పై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో స్వార్థం చూసుకోలేదని, ఎన్నో పదవులు ఇస్తామని రాజకీయ పార్టీలు ఆశ చూపినా చలించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. -
అనుభవమున్న బలరాంనాయక్కే పట్టం కట్టండి
[ 11-05-2024]
కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్కు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను గెలిపించాలి: నామా
[ 11-05-2024]
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను గెలిపించాలని ఖమ్మం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
ప్రతిభావంతులకు ఉచిత కార్పొరేట్ విద్య
[ 11-05-2024]
పదో తరగతిలో ప్రతిభచాటిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. -
నేడు చంద్రబాబు కోసం రాజశ్యామల యాగం
[ 11-05-2024]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రాజశ్యామల యాగాన్ని శనివారం నిర్వహించనున్నట్లు తెదేపా తెలంగాణ లీగల్ సెల్ నాయకులు -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది నామినేషన్లు చెల్లుబాటు
[ 11-05-2024]
ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్లు సమర్పించారని రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
[ 11-05-2024]
ఉరేసుకుని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గుండెపూడిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు