స్వయం ప్రేరణతో పోలింగ్ మెరుగు
తాజా లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో రెండు దశల పోలింగ్ ముగిసింది. చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో మునుపటి (2019) ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది.
వినూత్న ప్రయత్నాలతోనే చైతన్యం
కొత్తగూడెం, న్యూస్టుడే
తాజా లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో రెండు దశల పోలింగ్ ముగిసింది. చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో మునుపటి (2019) ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలోనూ 2019 ఎన్నికల్లో నాలుగో వంతు మంది ఓటుకు దూరంగా ఉన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలున్న నియోజకవర్గాలతో పోల్చిచూస్తే ఖమ్మం నగరంలోనే తక్కువ పోలింగ్ (73.14%) నమోదైంది. ‘నేకొక్కడినే ఓటేయకుంటే ఏమవుతుంది?’ అనే ఉదాసీనతలోంచి బయటపడేసి.. ఓటర్లంతా స్వయం ప్రేరణతో కేంద్రాలకు తరలివచ్చేలా ఎన్నికల యంత్రాంగం చైతన్యం కల్పించాలి. రాజకీయ పార్టీలు సైతం సహకరించాలి.
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, సులభతరంగా ఓటు వినియోగించుకోవడమే లక్ష్యమని ఉమ్మడి జిల్లాల ఎన్నికల యంత్రాంగం చెబుతోంది. కానీ, మెరుగైన ఓటింగ్ నమోదుకు అనుసరించే పద్ధతులు తేలిపోతున్నాయి. వసతుల కల్పన, ఓటరు చైతన్యానికి అనుసరిస్తున్న ‘అందరికీ ఒకే పద్ధతి’ వ్యూహం సత్ఫలితాలివ్వడం లేదు. నగరాలు, పట్టణం, పల్లెలు, గిరిజన గూడేలకు వేర్వేరు వ్యూహాలు అనుసరించాలి. ఓటరు సంఖ్యకు తగ్గట్టు పోలింగ్ కేంద్రాల పెంపు, దూరప్రాంతాలకు ప్రజా రవాణాపై దృష్టిపెట్టాలి. దీనికి బూత్ల వారీ కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి. వేసవి ఎండల దృష్ట్యా కేంద్రాల్లో రద్దీ నిర్వహణకు చర్యలు చేపట్టాలి. చీమల్లాంటి బారులను చూసి ఓటేసేందుకు రానివారే ఎక్కువని గత ఎన్నికల్లో రుజువైంది. పోలింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగేలా సిబ్బందిని అప్రమత్తం చేయడం, రద్దీ నియంత్రణలో ఉండేలా చూడటం, షామియానాలు, తాగునీరు, ఓఆర్ఎస్, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించడం ముఖ్యం. పట్టణాల్లో షెల్టర్లు, పార్కింగ్ వంటివి ఏర్పాటు చేయాలి. 85 ఏళ్లుదాటిన వృద్ధులు, నలభై శాతం వికలత్వం గల దివ్యాంగులందరూ ఇళ్ల వద్ద వంద శాతం ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటేసే యువత, మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కేంద్రాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వీటి సంఖ్య పెంచి వంద శాతం పోలింగ్ లక్ష్యంగా ప్రోత్సహించాలి. స్థానిక నేపథ్యంతోనూ కేంద్రాలను తీర్చిదిద్ది ఓటర్లను రప్పించవచ్చు.
- వేలి సిరా చుక్క చూపుతూ దిగిన చిత్రాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు పలు రాష్ట్రాల్లో యువ ఓటర్లు ఉత్సాహం చూపారు. ఇలా అన్నివర్గాల ఓటర్లను ఆకర్షించేలా ఉమ్మడి జిల్లాల ఎన్నికల యంత్రాంగం, ‘స్వీప్’ విభాగం ప్రత్యేక చొరవచూపాలి.
- నాలుగో దశలో (మే 13న) పోలింగ్ జరిగే నేపథ్యంలో 5కె రన్, వాకథాన్, మారథాన్ వంటి కార్యక్రమాలను ముందే నిర్వహించి ఉత్సాహం నింపాలి.
- రెండో దశ లో భాగంగా కేరళలో ఓ పోలింగ్ కేంద్రాన్ని ‘అడవి థీమ్’తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఓటేసిన వారికి ఉచిత టిఫిన్, రాయితీలు కల్పిస్తూ ‘బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ చేసిన ప్రయత్నాన్ని ఖమ్మం, కొత్తగూడెం వంటి పట్టణాల్లో అనుసరించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
[ 17-05-2024]
పాత లింగాల గ్రామంలో స్థానిక శాసనసభ్యుడు కోరం కనకయ్య, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి సమక్షంలో గరిడేపల్లి మాజీ సర్పంచ్ బోడ రాంజీ నాయక్ కాంగ్రెస్లో చేరారు. -
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది
[ 17-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగదాంబ సెంటర్లో భారాస ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమం నిర్వహించారు. -
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను
-
వాళ్లను భారత్ గౌరవిస్తే.. మనం ‘దొంగలు’ అంటున్నాం- పాకిస్థాన్ మంత్రి
-
చార్ ధామ్లో ఇకపై రీల్స్ చిత్రీకరణ నిషిద్ధం
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ