logo

భాజపాకు చరమగీతం పాడాలి

పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు చరమగీతం పాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు అన్నారు.

Updated : 04 May 2024 15:53 IST

కామేపల్లి: పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు చరమగీతం పాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు అన్నారు. పింజరమడుగులో సీపీఎం పార్టీ మండల కమిటీ సమావేశం నాగభూషణం అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మతతత్వాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్న భాజపాను ఓడించాలన్నారు. మహబూబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గి కృష్ణ, శ్రీనివాసరెడ్డి, రామచంద్రయ్య కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని