పచ్చడి మామిడి మరింత ప్రియం
ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది.
మధిర, న్యూస్టుడే
మామిడికాయ ముక్కలు కొడుతున్న వ్యాపారి
ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది. ఈ ఏడాది మామిడికాయ ధరలు మూడింతలు పెరిగాయి. నూనె, ఇతర ముడిసరకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో పచ్చడి తయారీ సామాన్యులకు మరింత భారంగా మారింది.
ధరలు పెరిగాయి ఇలా..
ఏటా పచ్చడి మామిడికాయలు కిలో రూ.40-60 పలికేవి. ఈ ఏడాది ఏకంగా కిలో కాయల ధర రూ.130 నుంచి రూ.150కు పెరిగింది. పప్పునూనె కిలో ప్యాకెట్ ధర రూ.400 నుంచి రూ.420కు ఎగబాకింది. వేరుసెనగ నూనె కిలో రూ.140 నుంచి రూ.160కు పెరిగింది. వెల్లుల్లి సైతం కిలో ధర ప్రస్తుతం మార్కెట్లో నాణ్యతను బట్టి రూ.260 నుంచి రూ.320 వరకు, ఎండు మిరపకాయలు కిలో రూ.350 వరకు పలుకుతున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం రెండున్నర కిలోల పచ్చడి తయారీకి రూ.325 ఖర్చు అవుతుంది.
ఈ రకాలకు డిమాండ్
సాధారణంగా ప్రతి వేసవిలో ఏప్రిల్ 15 నుంచి జూన్ చివరి వరకు మామిడికాయ పచ్చడి పెడుతుంటారు. చిన్నరసం, తెల్లగులాబీ, జలాలు, నాటు రసాలు, నాటు మామిడికాయలు, మల్లెకలు వంటి రకాలను వినియోగిస్తారు. ప్రస్తుతం తెల్లగులాబీ, జలాలు, నాటురకాలు, మల్లికలు అందుబాటులో ఉన్నాయి. ఇవి జూన్ వరకు లభిస్తాయి. తర్వాత కృష్ణా జిల్లా నుంచి తీసుకొస్తారు. మార్కెట్లో కిలో రూ.150 వరకు ధర పలుకుతున్నాయి. ముక్కలు చేసినందుకు కిలో రూ.20 తీసుకుంటారు. ఎండుమిరపకాయల ధరలు కిలో రూ.350 వరకు ఉన్నాయి.
పచ్చడి పెట్టడం అత్త నేర్పించారు..
మల్లు నందిని
ఆవకాయ పచ్చడిని మహాలక్ష్మి, అన్నపూర్ణగా భావిస్తాం. తయారీ విధానాన్ని అత్త మాణిక్యమ్మ నుంచి నేర్చుకున్నా. ఏటా ఎక్కువ మోతాదులో తయారు చేసి బంధువులు, స్నేహితులకు అందజేస్తా. ఏడాది పొడవునా ఈ మా ఇంట్లో వినియోగిస్తాం. నా భర్త, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇద్దరు కుమారులకు ఆవకాయ పచ్చడి అంటే ఎంతో ఇష్టం.
ఖర్చులు బాగా పెరిగాయి
టి.రమాదేవి, గృహిణి, మధిర
ఈ ఏడాది మామిడికాయల ధర మూడు రెట్లు పెంచారు. నూనె, వెల్లుల్లి ధరలు పెరిగాయి. ఇది సామాన్యులకు కొంత భారంగా మారింది. నాణ్యమైన సరకులతో ఇంటివద్ద తయారు చేసే పచ్చడి రుచి, శుచిగా ఉంటుంది. అన్ని వర్గాల వారు ఆవకాయ పచ్చడిని అమిత ఇష్టంగా భావించి వినియోగిస్తారు. అలాంటి పచ్చడి తయారీకి ఈ ఏడాది ఖర్చులు అదనంగా అవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 15-06-2024]
విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన పినపాక మండల పరిధిలోని మల్లారంలో శనివారం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
[ 15-06-2024]
చింతకాని మండలం పందిళ్ళపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో నామవరం గ్రామానికి ... -
భట్టి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
[ 15-06-2024]
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం పురస్కరించుకొని చింతకాని మండలం నాగులవంచలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. -
పవన విద్యుత్తు వైపు.. సింగరేణి చూపు..
[ 15-06-2024]
‘పవన విద్యుత్తు ప్రయోజనాన్ని గ్రహించి.. దాన్ని ఒడిసిపడదాం’ అనే నినాదాన్ని ఈ ఏడాది ప్రపంచ పవన దినోత్సవం ప్రపంచానికి అందిస్తోంది. -
ఈకేవైసీ తప్పనిసరి
[ 15-06-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. -
ఉపాధి సరే.. భరోసా ఏదీ..?
[ 15-06-2024]
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలను నివారించే లక్ష్యంతో అమలు చేస్తున్నదే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. -
ఆయిల్పాం సాగుకు ప్రోత్సాహం
[ 15-06-2024]
ఆయిల్పాం తోటల సాగుకు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
వారికి సాంత్వన.. వీరికి వేతన యాతన!
[ 15-06-2024]
ఆపదలో ఉన్న అభాగ్య పిల్లలను సంరక్షించే విధుల్లో తలమునకలయ్యే ఉద్యోగులు వీరు. -
ఊరంతా వేడి నీటి పొగలు
[ 15-06-2024]
చలికాలం వచ్చిందంటే అక్కడి ‘నేలపై మేఘాలు’ కదులుతున్నట్లు అనిపిస్తుంది. -
ఆధ్యాత్మిక చిత్రమాలిక.. జైన మత వైభవ ప్రతీక
[ 15-06-2024]
కొత్తగూడెం జైన మందిరంలో జులైలో జరిగే ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవానికి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. -
అటానమస్ దిశ భద్రాచలం డిగ్రీ కళాశాల..!
[ 15-06-2024]
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మరో అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోనుంది. -
బస్సు మరమ్మతుల భారం
[ 15-06-2024]
ఆర్టీసీ డిపో గ్యారేజీల్లో అసిస్టెంట్ మెకానిక్ పోస్టుల కొరత వేధిస్తోంది. -
జేఈఈలో ర్యాంకు.. ఇంటర్లో ఫెయిల్
[ 15-06-2024]
జేఈఈలో ర్యాంకు వచ్చినప్పటికీ.. ఇంటర్లో ఫెయిలై సప్లిమెంటరీ పరీక్షలు రాసినందున సర్టిఫికెట్ సమర్పించడానికి గడువు ఇచ్చేలా ఆదేశించాలంటూ ఖమ్మం జిల్లాకు చెందిన భూక్యా లోహిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఖననం చేసిన మృతదేహానికి శవపరీక్ష
[ 15-06-2024]
ఖననం చేసిన వ్యక్తి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన ఘటన సత్తుపల్లి మండలం గంగారంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
బురదలో కూరుకుపోయిన యువకుడు.. కాపాడిన పోలీసులు
[ 15-06-2024]
బురదలో కూరుకుపోయిన యువకుడిని పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించి ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలంలో చోటుచేసుకుంది. -
ట్రాక్టర్ను ఢీకొన్న లారీ: ఇద్దరు దుర్మరణం
[ 15-06-2024]
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు వారు. నిత్యం కూలీ పనులకు వెళ్తేనే కుటుంబీకుల ఆకలి తీరుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు