logo

డివిజన్‌ సమస్యలపై కలెక్టర్‌ సమీక్ష

ఆదోని పురపాలక కౌన్సిల్ హాలులో మంగళవారం జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు అధ్యక్షతన డివిజనల్‌ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ అంశాలతోపాటు

Updated : 28 Jun 2022 16:16 IST

ఆదోని మార్కెట్ : ఆదోని పురపాలక కౌన్సిల్ హాలులో మంగళవారం జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు అధ్యక్షతన డివిజనల్‌ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ అంశాలతోపాటు, జగనన్న ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఓటీఎస్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేసి, ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలో జరిగే నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. అనంతరం శాఖలవారీగా సమీక్ష చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఆర్డీవో రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని