logo

సమర్థంగా విధులు నిర్వహించండి

ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సమర్థంగా విధులు నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు.

Published : 15 Aug 2022 02:02 IST

మంత్రి బుగ్గనను సన్మానిస్తున్న అధికారులు

కర్నూలు నగరం (జడ్పీ), బేతంచెర్ల, న్యూస్‌టుడే : ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సమర్థంగా విధులు నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు. పదోన్నతులు పొందిన ఎంపీడీవోలు బేతంచెర్లలోని మంత్రి నివాసంలో ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపి నిర్ణయం తీసుకున్నారని, ఈమేరకు గ్రామీణాభివృద్ధికి మేలు జరిగేలా పనిచేయాలని కోరారు. మంత్రిని కలిసినవారిలో జడ్పీ ఉప సీఈవో భాస్కర నాయుడు, డీపీవో నాగరాజనాయుడు, డ్వామా పీడీ అమరనాథరెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని