నాణ్యమైన సెల్ఫోన్లు అందించాలని ధర్నా
నాణ్యమైన సెల్ ఫోన్లు, ట్యాబ్లు అందించాలని ఆదోని సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీ
ఆదోని మార్కెట్: నాణ్యమైన సెల్ ఫోన్లు, ట్యాబ్లు అందించాలని ఆదోని సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాణ్యమైన పరికరాలు ఇవ్వకపోవడంతో మరమ్మతులకు గురవతున్నాయన్నారు. దీంతో సొంతంగా డబ్బులు వెచ్చించి మరమ్మతులు చేయించినా ఫలితం ఉండటం లేదని తెలిపారు. రోజువారీ విధుల్లో సాంకేతిక సమస్యలతో పని జరగక మానసిక వేదనకు గురవుతున్నట్లు వివరించారు. దీంతో పాటు పెరిగిన ధరలకనుగుణంగా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయ సూపర్వైజర్ సునీతకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సోమక్క, రిజ్వానా, భువనేశ్వరి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్