logo

ఉపాధ్యాయుల ఆందోళన

ఉపాధ్యాయుల సర్దుబాటు నిలిపివేయాలని ఏపీ యూటీఎఫ్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి జయరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 06 Dec 2022 02:26 IST

డీఈవో కార్యాలయం ఎదుట బైఠాయించిన ఉపాధ్యాయులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సర్దుబాటు నిలిపివేయాలని ఏపీ యూటీఎఫ్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి జయరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని రాష్ట్ర యూటీఎఫ్‌ పిలుపు మేరకు సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు తక్షణమే స్థానాలు కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని