logo

సారొచ్చి వెళ్లారు.. అవస్థలు మిగిల్చారు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా హడావుడిగా మురుగు కాల్వలు తీసిన గ్రామపంచాయతీ అధికారులు నిర్మాణాలు  వదిలేశారు.

Published : 22 Jun 2023 03:07 IST

న్యూస్‌టుడే, పత్తికొండ పట్టణం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా హడావుడిగా మురుగు కాల్వలు తీసిన గ్రామపంచాయతీ అధికారులు నిర్మాణాలు  వదిలేశారు. పత్తికొండ పట్టణంలో ఈ నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పట్టణంలోని కర్నూలు రహదారిలో కుడివైపు మురుగు కాల్వపై ఉన్న బండలు తొలగించి తవ్వారు. తర్వాత ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసి 21 రోజులు గడిచినా.. ఇంత వరకు గ్రామపంచాయతీ అధికారులు కాల్వ నిర్మాణంపై మాత్రం దృష్టిసారించడంలేదు. కర్నూలు రహదారిలోని పాతబస్టాండ్‌ అంబేడ్కర్‌ కూడలి నుంచి సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల వరకు వివిధ దుకాణాల యజమానులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలకు వెళ్లేందుకు నిర్మాణాలు చేపట్టకపోవడంతో కాలువపైనే చెక్కలు, ఇనుపకడ్డీలు, బండలు, కర్రలు వేసుకుని నడకసాగిస్తున్నారు.  కాల్వ నిర్మాణం చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని