ఆరు మీటర్లున్నాయట.. అమ్మఒడి రాదట
ప్రభుత్వం ఏదో ఓ మెలిక పెట్టి పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విడుదల చేసిన అమ్మఒడి పథకం పొందేందుకు అన్నివిధాలా అర్హతలున్నా..
ఆరు విద్యుత్తు మీటర్లు ఉన్నాయని చెబుతున్న ఇల్లు ఇదే
ప్రభుత్వం ఏదో ఓ మెలిక పెట్టి పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విడుదల చేసిన అమ్మఒడి పథకం పొందేందుకు అన్నివిధాలా అర్హతలున్నా.. తమకు మంజూరు కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమ్మఒడి కోసం ఆశగా ఎదురు చూసినా చాలా మందికి నిరాశే ఎదురైంది. మద్దికెర మండలం అగ్రహారానికి చెందిన మన్యం లక్ష్మీదేవికి పాత ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఒకే ఒక మీటరు ఉంది. కానీ ఆరు ఉన్నాయంటూ ఆమె కుమార్తె వైష్ణవికి అమ్మఒడి పథకం అందకుండా చేశారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న తన కుమార్తెకు గత ఏడాదీ పథకం వర్తించింది. ఇప్పుడు ఏకంగా ఆరు విద్యుత్తు మీటర్లు ఉన్నాయని అధికారులు నివేదిక ఇచ్చారు.. వేరే వారి పేరుపై ఉన్న మీటర్లన్నీ మావే అన్నట్లు చెబుతూ లబ్ధి దక్కకుండా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలున్నా ఇలాంటి మెలికలతో పథకాలు అందకుండా కోత విధిస్తున్నారని వాపోయారు. నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది.. విచారించి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
మన్యం లక్ష్మీదేవి, అగ్రహారం
* ఈ విషయాన్ని మద్దికెర ఎంఈవో రంగస్వామితో ప్రస్తావించగా.. అర్హత ఉండి అమ్మఒడి అందని వారి సమస్య గుర్తించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది అందిన వారికి ఈ విద్యాసంవత్సరం రాకపోవడానికి కారణాలు గుర్తించి నివేదిక అందిస్తామన్నారు.
మద్దికెర, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మిగనూరులో భారీ వర్షం
[ 17-05-2024]
నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. -
మా‘రీచ్’లపై కన్నేయండి
[ 17-05-2024]
నదీతీరాల్లో ఇసుకను యంత్రాలతో తవ్వొద్దని ఎవరెన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఎన్జీటీ హెచ్చరించినా.. కోర్టులు మొట్టికాయలు వేసినా తవ్వకాలు ఆపలేదు. -
కత్తి దూస్తున్న కక్షలు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.. అనంతరం పల్లెల్లో కక్షలు కత్తి దూస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పార్టీల ఫిరాయింపులు మొదలుకొని ఇరువర్గాల మధ్య గొడవలు, ఘర్షణలతో రాజకీయ వైరం పెరిగింది. -
భూసార పరీక్షలనేలచూపులు
[ 17-05-2024]
పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. నేల లక్షణాలు.. ఇందులో లోపించిన సూక్ష్మధాతువుల వివరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. -
ఏపీఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏపీఈఏపీ సెట్ గురువారం ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో మొత్తం 3,675 మంది దరఖాస్తు చేసుకోగా 3,419 మంది హాజరయ్యారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
పారిశ్రామిక శిక్షణ సంస్థలు వృత్తివిద్యలో తర్ఫీదును ఇస్తూ స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించేందుకు మార్గాన్ని చూపుతున్నాయి. -
వైకాపా నాయకుల తీరుతోనే హింసాత్మక ఘటనలు
[ 17-05-2024]
వైకాపా నాయకుల తీరు కారణంగానే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ అన్నారు. -
కూటమిదే అధికారం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన కూటమి విజయం సాధిస్తుందని.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి అన్నారు. -
అతిసారంతో 16 మందికి అస్వస్థత
[ 17-05-2024]
బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో అతిసారం ప్రభలడంతో గురువారం 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. -
తెదేపా కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి
[ 17-05-2024]
ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న తెదేపా అనుచరులపై పలువురు మూకుమ్మడి దాడిచేసిన ఘటన మహానంది మండలం గోపవరం గ్రామంలో గురువారం జరిగింది. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం భద్రత
[ 17-05-2024]
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నియమించిన పోలీసు బలగాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన పేర్కొన్నారు. -
గడప చేరని బియ్యం
[ 17-05-2024]
పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!