తుంగ తాగలేని గంగ
తుంగభద్ర జలాలు గరళంగా మారుతున్నాయి.. 193 పల్లెలు.. 10.74 లక్షల మంది గొంతులు తడుపుతున్న నీరంతా కలుషితమవుతోంది..
నదిలోకి నగర వ్యర్థాలు
తీవ్రస్థాయిలో కలుషితం
కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్టుడే: తుంగభద్ర జలాలు గరళంగా మారుతున్నాయి.. 193 పల్లెలు.. 10.74 లక్షల మంది గొంతులు తడుపుతున్న నీరంతా కలుషితమవుతోంది.. ఆ నీటితో కనీసం చేతులు శుభ్రం చేసుకోవడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి.. జల కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనాల్లో తేలింది.. నగరంలో మురుగు నేరుగా నదిలోకి వెళ్తోంది.. శుద్ధి కేంద్రాలు నిర్మించాలని కార్పొరేషన్ అధికారులకు పలుమార్లు తాఖీదులు జారీ చేసినా స్పందన ఉండటం లేదు.
మురుగులో హామీలు
8 కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కార్పొరేషన్కు ఇప్పటికే 20కు పైగా తాఖీదులు జారీ చేశారు. ఇందుకు స్పందించిన కార్పొరేషన్ అధికారులు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించి మురుగంతా నాలుగుచోట్ల కలిసేలా చేసి అక్కడ శుద్ది కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
8 కల్లూరు దేవనగర్ వద్ద హంద్రీ వంతెన సమీపంలో 10 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు ఏళ్లుగా సాగుతున్నాయి. పాత నగరం జమ్మిచెట్టు వద్ద 2 ఎంఎల్డీ సామర్థ్యమున్న శుద్ధి కేంద్రం పనులు ఇలానే ఉండటం గమనార్హం.
రూ.5 కోట్ల జరిమానా
నగరంలోని 52 వార్డుల పరిధిలో 60 ఎంఎల్ఎడీ మురుగు ఉత్పత్తి అవుతోంది. మురుగు, వ్యర్థాలు నేరుగా నదిలోకి వెళ్తున్నాయి. కోలి బ్యాక్టీరియా సరాసరిన 600 సీఎఫ్యూ/100 ఎంఎల్ ఉండాలి. కొన్నిచోట్ల 1,100-1,200 దాటేయడం గమనార్హం. కోలి బ్యాక్టీరియా 50 దాటితే ఆ నీటిని సాధారణ శుద్ధితోపాటు తాగేందుకు వాడాలి. సరిగా శుద్ధి చేయకుంటే విరేచనాలు, టైఫాయిడ్, హెపటైటిస్ బారిన పడే అవకాశముంది. నది కలుషితంపై 2019 ప్రాంతంలో ఎన్జీటీ శేషశయనారెడ్డి కమిటీ ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ నిర్లక్ష్యాన్ని గుర్తించి 2019లో రూ.5 కోట్ల వరకు జరిమానా విధించారు.
తీవ్రస్థాయిలో కోలిఫాం
* నగరంలో నిత్యం 60 ఎంఎల్డీల మురుగు ఉత్పత్తవుతోంది. అందులో 22.1 ఎంఎల్డీలు నదిలో కలుస్తోంది. మురుగంతా నదిలో కలవడంతో కలుషితం పెరుగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. నీటి కాలుష్య తీరు తెలుసుకొనేందుకు 11 చోట్ల ఎప్పటికప్పుడు నాణ్యతా పరీక్షలు చేస్తున్నారు.
* నదిలో కలుస్తున్న మురుగు నీటిలో కోలిఫాం తీవ్రస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా మురుగు నీటిలో 500 ఎంపీఎన్/100 మిల్లీలీటర్లు ఉండాలి. నగరంలో ఉత్పత్తవుతున్న మురుగులో కోలిఫాం 2,500పైగా ఉండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. శుద్ధి చేసి సరఫరా చేస్తున్న నీటిలోనూ 500-800 వరకు ఉంటుండటం గమనార్హం. బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ప్రమాణాల ప్రకారం 30 ఎంజీ/లీటరు నీటిలో ఉండాలి. నదిలో 50-60 మధ్య ఉండటం కలవరపెడుతోంది.
పాత నగరంలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మిగనూరులో భారీ వర్షం
[ 17-05-2024]
నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. -
మా‘రీచ్’లపై కన్నేయండి
[ 17-05-2024]
నదీతీరాల్లో ఇసుకను యంత్రాలతో తవ్వొద్దని ఎవరెన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఎన్జీటీ హెచ్చరించినా.. కోర్టులు మొట్టికాయలు వేసినా తవ్వకాలు ఆపలేదు. -
కత్తి దూస్తున్న కక్షలు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.. అనంతరం పల్లెల్లో కక్షలు కత్తి దూస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పార్టీల ఫిరాయింపులు మొదలుకొని ఇరువర్గాల మధ్య గొడవలు, ఘర్షణలతో రాజకీయ వైరం పెరిగింది. -
భూసార పరీక్షలనేలచూపులు
[ 17-05-2024]
పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. నేల లక్షణాలు.. ఇందులో లోపించిన సూక్ష్మధాతువుల వివరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. -
ఏపీఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏపీఈఏపీ సెట్ గురువారం ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో మొత్తం 3,675 మంది దరఖాస్తు చేసుకోగా 3,419 మంది హాజరయ్యారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
పారిశ్రామిక శిక్షణ సంస్థలు వృత్తివిద్యలో తర్ఫీదును ఇస్తూ స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించేందుకు మార్గాన్ని చూపుతున్నాయి. -
వైకాపా నాయకుల తీరుతోనే హింసాత్మక ఘటనలు
[ 17-05-2024]
వైకాపా నాయకుల తీరు కారణంగానే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ అన్నారు. -
కూటమిదే అధికారం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన కూటమి విజయం సాధిస్తుందని.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి అన్నారు. -
అతిసారంతో 16 మందికి అస్వస్థత
[ 17-05-2024]
బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో అతిసారం ప్రభలడంతో గురువారం 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. -
తెదేపా కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి
[ 17-05-2024]
ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న తెదేపా అనుచరులపై పలువురు మూకుమ్మడి దాడిచేసిన ఘటన మహానంది మండలం గోపవరం గ్రామంలో గురువారం జరిగింది. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం భద్రత
[ 17-05-2024]
స్ట్రాంగ్ రూమ్ల వద్ద నియమించిన పోలీసు బలగాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన పేర్కొన్నారు. -
గడప చేరని బియ్యం
[ 17-05-2024]
పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?