logo

శ్రీశైలంలో వైకాపాకు మరో షాక్

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైకాపాకు మరో షాక్‌ తగిలింది.

Updated : 28 Mar 2024 16:10 IST

శ్రీశైలం ఆలయం: నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైకాపా పార్టీకి మరో షాక్‌ తగిలింది. శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు జింకా గుండయ్య యాదవ్ వైకాపా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైకాపా పార్టీ విధానాలు నచ్చక పార్టీ వీడుతున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెలలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరుతానని వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని