logo

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మండల తెదేపా నాయకులు రామాంజనేయులు తిరుపతయ్య, రంగముని, రహంతుల్లా అన్నారు.

Updated : 30 Apr 2024 12:05 IST

గోనెగండ్ల: చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మండల తెదేపా నాయకులు రామాంజనేయులు తిరుపతయ్య, రంగముని, రహంతుల్లా అన్నారు. మండలంలో మండల కన్వీనర్ ఆధ్వర్యంలో తెదేపా అభ్యర్థుల తరఫున ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుని గెలిపించాలంటూ మండల తెదేపా నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోతో ముఖ్య మంత్రి జగన్‌ ప్రజలను మాయ చేయడం తప్ప దాంతో ఒరిగిందేమీ లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే సూపర్ సిక్స్ పథకాలతో నిజమైన అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో మాబువలి, రంగస్వామి, నాయుడు, రమేష్ నాయుడు, నూర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని